
అవాంతరాలు తలెత్తకుండా ధాన్యం కొనుగోలు
గద్వాల: ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా అన్ని రకాల జగ్రత్త చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. బుధవారం యాసంగిలో ధాన్యం కొనుగోలుపై రాష్ట్ర పౌరసఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగ్రావు, సివిల్సప్లై డీఎస్ఓ స్వామి, డీఎం విమల, పుష్పమ్మ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
తాగునీటి సమస్య తలెత్తకుండా..
గ్రామాల్లో తాగునీరు, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని అదనపు కలెక్టర్ నర్సింగ్రావు అధికారులను ఆదేశించారు. బుధవారం ఐడీవోసీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్హాలులో అధికారులతో సమీక్షించారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో సురక్షితమైన తాగునీరు, పారిశుద్ధ్యంపై ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తాగునీటి నాణ్యతను పరీక్షించి అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకునే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. దీనివల్ల భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. అదేవిధంగా ప్రభుత్వ భవనాల్లో రూఫ్ టాఫ్ హార్వెస్టింగ్ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. పాతబోర్ల రీచార్జింగ్ ద్వారా భూగర్భ జలాలను పెంచుకునే విధంగా వ్యవసాయ శాఖ అధికారులు పనిచేయాలన్నారు. సమావేశంలో మిషన్భగీరథ ఇంట్రా ఈఈ శ్రీధర్రెడ్డి, నీటిపారుదల శాఖ ఈఈ శ్రీనివాస్రావు, వైద్యారోగ్య శాఖ ప్రోగ్రాం అధికారి డాక్టర్ సంద్య తదితరులు పాల్గొన్నారు.