ఇఫ్తార్‌ 6–27 (శనివారం సాయంత్రం) | - | Sakshi
Sakshi News home page

ఇఫ్తార్‌ 6–27 (శనివారం సాయంత్రం)

Mar 8 2025 12:55 AM | Updated on Mar 8 2025 12:53 AM

సహర్‌ 5–18 (ఆదివారం తెల్లవారుజామున)

జోగుళాంబ ఆలయ

అభివృద్ధికి ప్రణాళిక

అలంపూర్‌: ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా జోగుళాంబ ఆలయ అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికను రూపొందించి.. ముందుకు సాగాలని దేవాదాయ శాఖ ఉన్నత స్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. తక్షణ పనుల కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు హైదరాబాద్‌ లోని ప్రజాభవన్‌లో శుక్రవారం జరిగిన సమావేశంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ జి.చిన్నారెడ్డి, ఎండోమెంట్‌ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్‌, కమిషనర్‌ శ్రీధర్‌, ఆలయ కమిటీ చైర్మన్‌ నాగేశ్వర్‌ రెడ్డి, వనపర్తి జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు రాజేంద్ర ప్రసాద్‌ యాదవ్‌, ఆగమ శాస్త్ర పండితులు గోవింద హరి, తదితరులు పాల్గొన్నారు. జోగుళాంబ ఆలయ సమగ్ర అభివృద్ధికి తాత్కాలిక, దీర్ఘ కాలిక పనుల జాబితాను సిద్ధం చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ నెల 20వ తేదీ నాటికి తాత్కాలిక, తక్షణ పనులను ఎంపిక చేసి నివేదిక అందజేయాలని కమిటీకి కాల పరిమితిని నిర్ణయించారు. తాత్కాలిక పనులలో భాగంగా ఆలయ ప్రాంగణంలో లైటింగ్‌, పార్కింగ్‌, ప్రచార బోర్డులు పెట్టనున్నారు. అందుకు బస్‌స్టాండ్లు, రైల్వే స్టేషన్లు ఇతర ముఖ్య ప్రదేశాలను ఎంపిక చేయనున్నారు. దీర్ఘ కాలిక పనులలో బోటింగ్‌, టూరిజం అభివృద్ధి, అతిథి గృహాల నిర్మాణాలు, ఎవెన్యూ ప్లాంటేషన్‌, ఆర్చిల ఏర్పాటు వంటి పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా చిన్నారెడ్డి పలు సూచనలు చేశారు. సూర్యనారాయణ మూర్తి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఎండోమెంట్స్‌ జాయింట్‌ కమిషనర్‌ రామకృష్ణ, ఆలయ అధికారులు పాల్గొన్నారు.

ఇఫ్తార్‌ 6–27 (శనివారం సాయంత్రం)1
1/1

ఇఫ్తార్‌ 6–27 (శనివారం సాయంత్రం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement