నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్ట్‌ | - | Sakshi
Sakshi News home page

నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్ట్‌

May 31 2025 1:14 AM | Updated on May 31 2025 1:14 AM

నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్ట్‌

నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్ట్‌

కాటారం: రైతుల అమాయకత్వాన్ని ఆసరగా చేసుకొని డీలర్లు నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్ట్‌ నమోదు చేస్తామని కాటారం డీఎస్పీ గడ్డం రామ్మోహన్‌రెడ్డి హెచ్చరించారు. కాటారం మండలకేంద్రంలోని ఫర్టిలైజర్‌, విత్తన విక్రయ దుకాణాల్లో వ్యవసాయశాఖ, పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. దుకాణాల్లో విక్రయిస్తున్న పత్తి విత్తనాల కంపెనీ వివరాలు, నిల్వ ఉన్న స్టాక్‌, రిజిస్టర్లు పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ పర్యావరణానికి హానిచేసే హెచ్‌టీ కాటన్‌, బీజీ–3 విత్తనాలను విక్రయించవద్దని సూచించారు. నాన్‌లేబుల్డ్‌ సంచులలో ఉన్న విత్తనాలను అమ్మితే కేసులు నమోదు చేయనున్నట్లు హెచ్చరించారు. ఎమ్మార్పీ ధరలకు మించి విక్రయించవద్దని, కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్‌లో విక్రయిస్తే ఊరుకోబోమని పేర్కొన్నారు. రైతులు అడిగిన విత్తనాలు మాత్రమే ఇవ్వాలని నాసిరకం విత్తనాలు వారికి అంటగంటవద్దన్నారు. తప్పనిసరిగా కొనుగోలు రశీదు ఇవ్వాలని తెలిపారు. ఈ తనిఖీల్లో డీఎస్పీ వెంట ఏఓ పూర్ణిమ, ఎస్సై మ్యాక అభినవ్‌ ఉన్నారు.

రైతులకు ఇబ్బందులు

కలగకుండా చూసుకోవాలి..

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు చూసుకోవాలని డీఎస్పీ గడ్డం రామ్మోహన్‌రెడ్డి సూచించారు. పీఏ సీఎస్‌ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని గారెపల్లిలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం డీఎస్పీ పరిశీలించారు. కొనుగోళ్లు, ధా న్యం నిల్వలు, రవాణాపై ఆరా తీశారు. కొనుగోళ్లు వేగవంతంగా చేపట్టి త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. అనంతరం అంకుషాపూర్‌లోని అన్నపూర్ణ రైస్‌మిల్‌ను డీఎస్పీ తనిఖీచేశారు. ధాన్యం వెంటవెంటనే దిగుమతి చేసుకోవాలని సూచించా రు. డీఎస్పీ వెంట ఎస్సై మ్యాక అభినవ్‌, పీఏసీఎస్‌ సీఈఓ ఎడ్ల సతీశ్‌, సిబ్బంది గోపాల్‌ ఉన్నారు.

కాటారం డీఎస్పీ గడ్డం రామ్మోహన్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement