
ఇంటర్నెట్ కేబుల్స్ సరిచేయాలి
భూపాలపల్లి రూరల్: జిల్లాలో విద్యుత్ స్తంభాలపై ఇంటర్నెట్ కేబుల్స్ సరిచేయాలని జిల్లా విద్యుత్ శాఖ ఎస్ఈ మల్సూర్ నాయక్ ఆపరేటర్లకు సూచించారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఎస్ఈ కార్యాలయంలో కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని విద్యు త్ కేబుల్ టీవీ వైర్లు వివిధ కంపెనీల ఇంట ర్నెట్ వైర్లు విద్యుత్ స్తంభాలపై అస్తవ్యస్తంగా తగిలించడంతో విద్యుత్ సిబ్బందికి మరమ్మతు చేయడం ఇబ్బందిగా ఉంటుందన్నారు. కొన్ని రో డ్లపై కిందికి వేలాడుతుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఈ సమావేశంలో భూపాలపల్లి విద్యుత్ శాఖ డీఈ పాపిరెడ్డి, ఏడీఈ నాగరాజు, భూపాలపల్లి జిల్లాలోని కేబుల్, ఇంటర్నెట్ ఆపరేటర్లు పాల్గొన్నారు.