
సర్దుబాటు ప్రక్రియ వాయిదా వేయాలి
భూపాలపల్లి అర్బన్: జిల్లాలో ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియను వాయిదావేయాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రేగూరి సుభాకర్రెడ్డి, కుసునపు కిరణ్కుమార్ కోరారు. బుధవారం జిల్లా విద్యాశాఖ అధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి, విద్యార్థుల సంఖ్యను గణనీయంగా పెంచుకోవడం కోసం ఈ వేసవి సెలవులలో వివిధ కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఒకవైపు బడిబాట షెడ్యూల్ను ఈనెల 6వ తేదీ నుంచి 19వ తారీకు వరకు ప్రకటించి, పాఠశాలలను బలోపేతం చేసేందుకు రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. ఉపాధ్యాయులను సర్దుబాటు చేసే ప్రక్రియ 13వ తేదీలోపు పూర్తి చేయాలని మరొక ఉత్తర్వులను ఇచ్చి ఉపాధ్యాయులను, తల్లిదండ్రులను, విద్యార్థులను గందరగోళానికి గురిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు కుసుమ కృష్ణమోహన్, నాయకులు లింగమూర్తి, హరిప్రసాద్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.