బడిఈడు పిల్లలను బడిలో చేర్పించాలి | - | Sakshi
Sakshi News home page

బడిఈడు పిల్లలను బడిలో చేర్పించాలి

Jun 7 2025 1:32 AM | Updated on Jun 7 2025 1:32 AM

బడిఈడు పిల్లలను బడిలో చేర్పించాలి

బడిఈడు పిల్లలను బడిలో చేర్పించాలి

గణపురం: బడిఈడు పిల్లలను బడిలో చేర్పించాలని జిల్లా విద్యాశాఖ అధికారి ముద్దమల్ల రాజేందర్‌ తెలిపారు. శుక్రవారం మండలంలోని చెంచుకాలనీలో ఏర్పాటు చేసిన బడిబాట కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు బడిబాట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పించాలని కోరారు. ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, దుస్తులు, మధ్యాహ్న భోజనం అందజేస్తోందని, ఆహ్లాదకర వాతావరణంలో విద్యా బోధనను అందిస్తున్నామని వివరించారు. ప్రతి విద్యార్థి ప్రభుత్వ బడిలో చదువుకోవాలని కోరారు.కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

డీఈఓ రాజేందర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement