
త్యాగానికి ప్రతీక బక్రీద్
● కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి: బక్రీద్ పండుగ త్యాగానికి ప్రతీకగా నిలుస్తుందని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. శుక్రవారం కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో ప్రేమ, సౌబ్రాతృత్వంతో ఎలాంటి విభేదాలు లేకుండా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. అన్ని మతా లను గౌరవించే భారతదేశ సంస్కృతిలో బక్రీద్ పండుగ విశేష స్థానం కలిగి ఉందన్నారు. ఈ పండుగను శాంతియుతంగా, స్నేహపూర్వక వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జిల్లా ప్రజలందరికీ కలెక్టర్ బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు.
పుష్కర పనులు
పూర్తి చేయాలి
కాళేశ్వరం: గత నెల 15 నుంచి 26వ తేదీ వరకు కాళేశ్వరంలో జరిగిన సరస్వతీనది పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.35కోట్ల నిధులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. కాగా పుష్కరాల సమయంలో సమయాభావంతో కొన్ని పనులు నిలిచిపోయాయి. వాటిని రెండు రోజుల్లో ప్రారంభించాలని రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ వెంకట్రావు ఈఓ మహేష్ను ఆదేశించినట్లు తెలిసింది. దీంతో ఆయన సంబంధిత కాంట్రాక్టర్లకు రెండు రోజుల్లో నిలిచిన పనులు మొదలుపెట్టాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా, వీఐపీ ఘాటు పుష్కరఘాటు, సరస్వతీ అమ్మవారి విగ్రహంపై స్లాబు, అక్కడి తోరణాలు, ప్రసాద కౌంటర్, కల్యాణకట్ట భవనం, మరుగుదొడ్ల నిర్మాణాలు, మెయిన్ఘాటు తోరణం పనులు నిలిచిన విషయం తెలిసిందే.
ఎన్ఎంఎంఎస్కు
21 మంది విద్యార్థుల ఎంపిక
భూపాలపల్లి అర్బన్ : నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్నకు (ఎన్ఎంఎంఎస్) జిల్లా వ్యాప్తంగా 21 మంది విద్యార్థులు ఎంపికై నట్లు డీఈఓ రాజేందర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గతేడాది నవంబర్లో నిర్వహించిన అర్హత పరీక్షకు జిల్లా నుంచి 55 పాఠశాలలకు చెందిన 425మంది విద్యార్థులు హా జరు కాగా 21మంది అర్హత సాధించినట్లు వివరించారు. 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు నాలుగేళ్ల పాటు ప్రతి ఏడాది రూ.12వేల స్కాలర్షిప్ను ప్రభుత్వం అందిస్తుందన్నారు. విద్యార్థుల్లో దాగిన ప్రతిభను వెలికితీసిన ఉపాధ్యాయులను అభినందించారు.
‘ఆపరేషన్ కగార్’ను నిలిపేయాలి
చిట్యాల: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపేయాలని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2026 మార్చి నాటికి మావోయిస్టులను నిర్మూలిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం ఫాసిస్టు చర్యలో భాగమేనన్నారు. ఆపరేషన్ కగార్ పేరుతో ఇప్పటి వరకు 540 మందిని చట్ట విరుద్ధంగా హత్య చేశారన్నారు. చట్ట విరుద్ధ హత్యలను సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ కేంద్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. వామపక్ష , లౌకిక, ప్రజాతంత్ర ప్రజాస్వామ్య శక్తులు, ప్రజలు చర్చలు చేయాలని కోరుతున్నా.. కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయకపోవడం విచారకరమన్నారు. ఈ నెల 14న హైదరాబాద్లో జరిగే ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.
అధ్యాపకులకు
పీహెచ్డీ గైడ్షిప్
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ అండ్ పీజీ కళాశాలల అధ్యాపకులకు పీహెచ్డీ గైడ్షిప్ ఇవ్వనున్నారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం కాకతీయ యూనివర్సిటీలో జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. పలు అకాడమిక్ సిలబస్ల మార్పు, పరీక్షలు, దూరవిద్యలో సర్టిఫికెట్ డిప్లొమా కోర్సులు, తదితర అంశాలపై చర్చించి ఆమోదించారు. ఒక క్లస్టర్ డిగ్రీ అండ్పీజీ కళాశాల పరిధిలోకి వచ్చే అధ్యాపకులు ఆ క్లస్టర్ డిగ్రీకళాశాలనుంచే పీహెచ్డీ గైడ్షిప్కోసం దరఖాస్తు చేసుకోవాల్సింటుంది. ఎంతమందికి గైడ్షిప్ ఇవ్వనున్నది కొద్దిరోజు ల్లో తేలనుంది. అదేవిధంగా కేయూ పరిధిలో డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ఫార్మసీ, లా విద్య (నాన్ ప్రొఫెషనల్, ప్రొఫెషనల్) కోర్సుల్లో కొన్ని సంత్సరాలుగా ఫెయిల్ అయి బ్యాక్లాగ్ సబ్జెక్టులు కలిగిన విద్యార్ధులకు పరీక్షలు రాసేందుకు అవకాశం కల్పిస్తూ స్టాండింగ్ కమిటీలో నిర్ణయం తీసుకున్నారు. 2025–2026 విద్యాసంవత్సరంలో రెగ్యులర్ కోర్సుల సెమిస్టర్ల పరీక్షలతో వీరు రాసుకునే అవకాశం కల్పి స్తారు. దూరవిద్యలోని ఇయర్వైజ్ స్కీం విద్యార్థులు బ్యాక్లాగ్ సబ్జెక్టులు రాసుకోవచ్చు. కే యూ దూరవిద్యలో 16వివిధ డిప్లొమా, సర్టిఫి కెట్ కోర్సులను ప్రవేశపెట్టాలని, ఎమ్మెస్సీ జి యాలజీ కోర్సులో సిలబస్ మార్పునకు ఆమోదించారు. వీసీ కె.ప్రతాప్రెడ్డి, రి జిస్ట్రార్ రామచంద్రం తదితరులు పాల్గొన్నారు.