‘అమ్మ ఆదర్శం’ అస్తవ్యస్తం | - | Sakshi
Sakshi News home page

‘అమ్మ ఆదర్శం’ అస్తవ్యస్తం

Jun 7 2025 1:32 AM | Updated on Jun 7 2025 1:34 AM

పనులు త్వరగా

పూర్తి చేయాలి

జిల్లాలో అసంపూర్తిగా ఉన్న అమ్మ ఆదర్శ పాఠశాలల పనులు త్వరగా పూర్తి చేయాలి. కలెక్టర్‌, విద్యాశాఖ అధికారులు స్పందించి పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలి. అమ్మ ఆదర్శ పాఠశాలల అభివృద్ధికి నిధులు ఉన్నప్పటికీ పనులు జరగడం లేదు. మన ఊరు మన బడి పథకానికి ప్రభుత్వం తక్షణమే నిధులు కేటాయించి పెండింగ్‌ పనులు పూర్తి చేయాలి.

– కొత్త కుమారస్వామి,

యూటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి

భూపాలపల్లి అర్బన్‌: జిల్లాలో చేపట్టిన అమ్మ ఆదర్శ పాఠశాలల పనులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. గతేడాది చేపట్టిన పనులు ఏడాది గడిచిన నెమ్మదిగా సాగుతున్నాయి. ఈ విద్యాసంవత్సరం మరో ఐదు రోజులైతే పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులకు సమస్యలు స్వాగతం పలకనున్నాయి. జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలలను శుక్రవారం ‘సాక్షి’ పరిశీలించగా పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు 438 ఉండగా వాటిలో సుమారు 24వేలకు పైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. అన్ని యాజమాన్యాల కింద ఉన్న 265 పాఠశాలలను రాష్ట్ర ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాలల కింద ఎంపిక చేసింది. ఇందులో భాగంగా చిన్నపాటి మరమ్మతులు, విద్యుత్‌, తాగునీరు, టైల్స్‌ వంటి పనులు చేపట్టేందుకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. విద్యుత్‌, తాగునీటి పనులు 90శాతం వరకు పూర్తయ్యాయి. మరుగుదొడ్లు, ఇతర మేజర్‌ పనులు మాత్రం 60 నుంచి 70శాతం మాత్రమే పూర్తయ్యాయి. 265 పాఠశాలలకు రూ.12.41కోట్లు మంజూరయ్యాయి.

220 పాఠశాలల్లో పనులు పూర్తి

జిల్లాలో ఎంపిక చేసిన 265 అమ్మ ఆదర్శ పాఠశాల్లో గతేడాది ఏప్రిల్‌ మాసంలో పనులను ప్రారంభించారు. వాటిలో ఇప్పటి వరకు 220 పాఠశాలల్లో మాత్రమే పనులు పూర్తి చేశారు. మిగతా 45 పాఠశాలల్లో పనులు కొనసాగుతున్నాయి. పూర్తి చేసిన పనులకు ఇప్పటి వరకు కలెక్టర్‌ రూ.5 కోట్ల నిధులు కమిటీలకు విడుదల చేశారు. సంబంధిత ఇంజనీరింగ్‌ శాఖల పర్యవేక్షణ లోపం, కమిటీ వద్ద పనులు చేసేందుకు చేతిలో డబ్బులు లేకపోవడంతో ముందుకు సాగడం లేదని పలువురు తెలిపారు.

‘మనఊరు–మన బడి’

పనులు కూడా అంతంతే..

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం జిల్లాలో రూ.32 కోట్లతో 149 ప్రభుత్వ పాఠశాలల్లో 2023 సంవత్సరంలో పనులు ప్రారంభించారు. ప్రభుత్వం మారడంతో మనఊరు–మనబడికి నిధులు కేటాయించకపోవడంతో అదనపు తరగతి గదులు, మరుగుదొడ్లు, కంపౌండ్‌, కిచెన్‌ షెడ్లు, భోజనశాలలు మధ్యలోనే నిలిచిపోయాయి.

పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటాం..

జిల్లాలో అమ్మ ఆదర్శ పాఠశాలల ద్వారా చేపడుత్ను పాఠశాలల అభివృద్ది పనులకు సంబంధించిన బిల్లులను వెంటనే చెల్లిస్తున్నాం. ఇంజనీరింగ్‌ శాఖ అధికారులు ఎంబీ రికార్డు చేయడంలో కొంత ఆలస్యం అవుతోంది. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేయాలని కమిటీలకు ఆదేశాలు జారీచేశాం. పెండింగ్‌ పనులను పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటాం.

– రాజేందర్‌,

జిల్లా ఇన్‌చార్జ్‌ విద్యాశాఖ అధికారి

ఏడాది దాటినా పూర్తి కాని అమ్మ ఆదర్శ పాఠశాలల పనులు

జిల్లా వ్యాప్తంగా 265 ప్రభుత్వ

పాఠశాలలు ఎంపిక

రూ.12.41 కోట్ల నిధుల కేటాయింపు

ఇప్పటివరకు చెల్లించింది

రూ.ఐదు కోట్లు మాత్రమే

మరో ఐదు రోజుల్లో

పాఠశాలల పునఃప్రారంభం

‘అమ్మ ఆదర్శం’ అస్తవ్యస్తం1
1/2

‘అమ్మ ఆదర్శం’ అస్తవ్యస్తం

‘అమ్మ ఆదర్శం’ అస్తవ్యస్తం2
2/2

‘అమ్మ ఆదర్శం’ అస్తవ్యస్తం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement