ముగిసిన వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు

Jun 7 2025 1:32 AM | Updated on Jun 7 2025 1:32 AM

ముగిసిన వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు

ముగిసిన వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు

గణపురం : జిల్లావ్యాప్తంగా నిర్వహించిన వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు శుక్రవారంతో ముగిసినట్లు జి ల్లా యువజన, క్రీడల శాఖ అధికారి సీహెచ్‌ రఘు తెలిపారు. మండలకేంద్రంలో శుక్రవారం నిర్వహించిన బ్యాడ్మింటన్‌ ముగింపు కార్యక్రమానికి డీవైఎస్‌ఓ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా నెల రోజుల పాటు శిక్షణ శిబిరాలు నిర్వహించినట్లు తెలిపారు. కోచ్‌ రవీందర్‌ పాల్గొన్నారు.

స్పోర్ట్స్‌ స్కూల్‌ ఎంపికకు సాధన చేయాలి

కాటారం : స్పోర్ట్స్‌ స్కూల్‌ ఎంపికకు చిన్నారులు సాధన చేయాలని అథ్లెటిక్‌ అసోసియేషన్‌ చైర్మన్‌ పంతకాని సమ్మయ్య అన్నారు. మండల కేంద్రంలో నెలరోజులుగా నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరం శుక్రవారంతో ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ముగింపు కార్యక్రమంలో పంతకాని సమ్మయ్య మాట్లాడుతూ.. విద్యార్థులు శిక్షణ అనంతరం సైతం ప్రాక్టిస్‌ కొనసాగించాలని సూ చించారు. కాటారంలో శిక్షణ పొంది రాష్ట్ర స్థాయికి ఎంపికై న 14 మంది చిన్నారులను అభినందించారు.4వ తరగతి విద్యార్థులకు తల్లిదండ్రులు శిక్షణ ఇప్పిస్తే స్పోర్ట్స్‌ స్కూల్‌కు ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. క్రీడా శిబిరం విజయవంతానికి కృషి చేసిన మాజీ ఉపసర్పంచ్‌ నాయిని శ్రీనివాస్‌, యువజన కాంగ్రెస్‌ నాయకుడు శ్రీకాంత్‌ నాయక్‌, వ్యాపారి మద్ది సంపత్‌, ఆత్మకూరి కుమార్‌, కోచ్‌ అశోక్‌ను ప్రత్యేకంగా అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement