సమన్వయంతో పుష్కరాలు విజయవంతం | - | Sakshi
Sakshi News home page

సమన్వయంతో పుష్కరాలు విజయవంతం

May 29 2025 7:25 AM | Updated on May 29 2025 7:25 AM

సమన్వయంతో పుష్కరాలు విజయవంతం

సమన్వయంతో పుష్కరాలు విజయవంతం

భూపాలపల్లి అర్బన్‌: కాళేశ్వరం సరస్వతీ పుష్కరాలు అన్ని శాఖల సమన్వయంతో విజయవంతం అయ్యాయని కలెక్టర్‌ రాహుల్‌శర్మ తెలిపారు. సరస్వతీ పుష్కరాలు విజయవంతంపై బుధవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఎస్పీ కిరణ్‌ఖరేతో కలిసి విలేకరులతో మాట్లాడారు. పుష్కరాలకు 30 లక్షల మందికి పైగా భక్తులు వచ్చారని, ఏర్పాట్లపై నిరంతరం ప్రభుత్వ మార్గదర్శనం మేరకు సమీక్షలు నిర్వహించి దిశానిర్దేశం చేశామన్నారు. సరస్వతీ మాతా విగ్రహం ఏర్పాటు చేసి, ప్రతీ రోజు కాశీపండితులచే నవరత్న మాల హారతి నిర్వహించామన్నారు. టెంట్‌ సిటీ ఏర్పాటు ద్వారా 40 రూములు, 200 డార్మెటరీ, ఫుడ్‌ కోర్టు, కిడ్స్‌ ప్లే జోన్‌, వాహన పార్కింగ్‌ ఏర్పాట్లతో సౌకర్యాలు కల్పించామన్నారు. వర్షంతో అవాంతరాలు వచ్చినా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చేశామన్నారు. స్వామి దర్శనానికి వచ్చిన భక్తులకు మజ్జిగ, మంచినీరు సరఫరా చేయడంతో పాటు క్యూలో ఉన్న భక్తుల సౌకర్యార్థం కూలర్లు ఏర్పాటు చేశామన్నారు. పుష్కరాల నిర్వహణ సంతృప్తిని ఇచ్చినట్లు తెలిపారు.

ఇదొక మంచి అనుభవం..

సరస్వతీ నది పుష్కరాలు మంచి అనుభవంగా ఉపయోగపడుతుందని ఎస్పీ కిరణ్‌ఖరే తెలిపారు. కాళేశ్వరం చిన్న గ్రామమని లక్షల్లో భక్తులు వచ్చినా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేశామన్నారు. తీవ్రవాద ప్రభావిత ప్రాంతమని, చాలా ప్రామాణికంగా తీసుకుని బందోబస్తు నిర్వహించామన్నారు. అధిక ఉష్ణోగ్రతలు, వర్షంతో ఇబ్బందులు వచ్చినా 24 గంటలు పనిచేశామన్నారు. పుష్కరాలకు మీడియా విస్తృత ప్రచారం కల్పించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో కాటారం సబ్‌ కలెక్టర్‌ మయాంక్‌ సింగ్‌, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ విజయలక్ష్మి, ఏఎస్పీ బోనాల కిషన్‌, కాటారం డీఎస్పీ రాంమోహన్‌రెడ్డి, డీపీఆర్‌ఓ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ రాహుల్‌శర్మ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement