
ప్రతీ గింజను కొనుగోలు చేస్తాం
● అదనపు కలెక్టర్ అశోక్కుమార్
మల్హర్: ప్రతీ గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు అధైర్య పడొద్దని అదనపు కలెక్టర్ అశోక్కుమార్ తెలిపారు. మండలంలోని కొయ్యూరు, వల్లెకుంట గ్రామాల్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా సెంటర్ల వారీగా ఇప్పటి వరకు సేకరించిన ధాన్యం వివరాలు, నిల్వ ఉన్న ధాన్యం వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హమాలీల కొరత లేకుండా, కొనుగోళ్ల వేగం పెంచి రెండు, మూడు రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేసి, మి ల్లులకు తలించాలని ఆదేశించారు. మండలానికి కే టాయించిన మిల్లుల టార్గెట్ పూర్తయితే పెద్దపల్లి జి ల్లాలోని మిల్లులకు తరలించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్ఓ శ్రీనాథ్, నిర్వాహకుల ఉన్నారు.