
కాళేశ్వరంలో పెరిగిన నీటిమట్టం
బొగత జలపాతం వద్ద సందడి చేస్తున్న పర్యాటకులు
త్రివేణి సంగమం వద్ద పెరిగిన నీటిమట్టం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని త్రివేణి సంగమం వద్ద నీటిమట్టం పెరిగింది. ఇటీవల ఎగువన అక్కడక్కడా వర్షాలు కురుస్తుండడంతో గోదావరి, ప్రాణహిత నదుల్లో నీటిమట్టం పెరుగుతోంది. శుక్రవారం 3వేల క్యూసెక్కుల ప్రవాహం దిగువకు తరలిపోతోంది. గత వారం 1,800 – 2,200 క్యూసెక్కుల వరకు ప్రవాహం తరలిపోయింది.
ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని చీకుపల్లి గ్రామ సమీపంలో ఉన్న బొగత జలపాతాన్ని చూసేందుకు పర్యాటకులు శుక్రవారం తరలివచ్చారు. అడపాదడప కురుస్తున్న వర్షాలకు గుట్టలపైనున్న వాగు పొంగడంతో ఆ నీరు బొగతకు వచ్చి చేరుతోంది. దీంతో జలపాతం వద్ద కనువిందు చేస్తున్న జలధారలను వీక్షించేందుకు పర్యాటకులు తరలి వస్తున్నారు.
బొగతలో పర్యాటకుల సందడి
– కాళేశ్వరం
– వాజేడు

కాళేశ్వరంలో పెరిగిన నీటిమట్టం