బొగ్గు ఉత్పత్తిని పెంచాలి | - | Sakshi
Sakshi News home page

బొగ్గు ఉత్పత్తిని పెంచాలి

May 29 2025 7:25 AM | Updated on May 30 2025 12:55 PM

భూపాలపల్లి అర్బన్‌: భూపాలపల్లి ఏరియాలో ఓపెన్‌కాస్టులో బొగ్గు ఉత్పత్తిని పెంచాలని ఏరియా సింగరేణి జనరల్‌ మేనేజర్‌ రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఏరియాలోని కేటీకే ఓసీ–2లో నూతనంగా కొనుగొలు చేసిన షావల్‌ వాహనాన్ని బుధవారం జీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ రూ.1.71కోట్లతో కొనుగోలు చేసిన వాహనానికి సరస్వతి అని నామకరణం చేసినట్లు తెలిపారు. 

ఈ షావల్‌ యంత్రం లేకపోవడంతో గంటకు రూ.7వేల నష్టం సింగరేణికి వాటిల్లుతుందన్నారు. దీంతో బొగ్గు ఉత్పత్తి చేసి ముందంజలో ఉండాలని సూచించారు. ఉద్యోగులకు కేటాయించిన 8 గంటల పనిని తప్పనిసరిగా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు కవీంద్ర, ఏర్రన్న, ప్రసాద్‌, వెంకటరమణ, భిక్షమయ్య, రాజరావు, కిష్టయ్య, నజీర్‌, కార్మిక సంఘాల నాయకులు రమేష్‌, మధుకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

డీఆర్‌డీఓగా బాధ్యతల స్వీకరణ

భూపాలపల్లి రూరల్‌: జయశంకర్‌భూపాలపల్లి జిల్లా డీఆర్‌డీఓగా పొరిక బాలకృష్ణ బుధవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ విధులు నిర్వహించిన నరేష్‌ జగిత్యాలకు బదిలీపై వెళ్లారు. ఈ సందర్భంగా డీఆర్‌డీఓ కార్యాలయం సిబ్బంది బాలకృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు.

‘చలో వరంగల్‌’ను జయప్రదం చేయాలి’

వాజేడు: మంద కృష్ణమాదిగ పద్మశ్రీ అవార్డు అందుకుని ఢిల్లీ నుంచి ఈనెల 31న వరంగల్‌కు వస్తున్నందున స్వాగతం పలికేందుకు నిర్వహించ తలపెట్టిన చలో వరంగల్‌ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎమ్మార్పీఎస్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి, ములుగు జిల్లా ఇన్‌చార్జ్‌ దుడ్డు రామకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం ఎమ్మార్పీఎస్‌, అనుబంధ సంఘాల నాయకులతో బుధవారం సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రపతి ముర్ము నుంచి పద్మశ్రీ అవార్డు అందుకుని వరంగల్‌కు వస్తున్న మంద కృష్ణకు స్వాగతం పలకడంతో పాటు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని మాదిగ, మాదిగ ఉపకుల సంఘాల నాయకులు, కార్యకర్తలు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు మడిపల్లి శ్యాంబాబు, పుల్లూరి కరుణాకర్‌, చె న్నం స్వామి, సమ్మయ్య, ప్రశాంత్‌, సర్వేశ్‌, నా ని, రాము తదితరులు పాల్గొన్నారు.

కోటను సందర్శించిన మాల్దీవ్స్‌ దేశస్తులు

ఖిలా వరంగల్‌: కాకతీయుల రాజధాని ఖిలా వరంగల్‌ కోటను బుధవారం మాల్దీవ్స్‌ దేశస్తులు సందర్శించారు. నాలుగు కీర్తితోరణాల నడుమ నళ్ల రాతిలో నాటి శిల్పులు చెక్కిన శిల్ప కళ సంపదను తిలకించారు. అనంతరం రాతి, మట్టికోట అందాలు, ఖుష్‌మహల్‌ను సందర్శించి కాకతీయుల కళాఖండాలను తమ వెంట తెచ్చుకున్న కెమెరాలలో బంధించుకున్నారు. కాకతీయుల చరిత్ర, విశిష్టతను కోట గైడ్‌ రవి వివరించారు. వారివెంట కేంద్రపురావస్తుశాఖ కోఆర్డినేటర్‌ శ్రీకాంత్‌, టీఎస్‌టీడీసీ కోట ఇన్‌చార్జ్‌ అజయ్‌ పాల్గొన్నారు.

నిట్‌లో టెమ్‌ ఎక్స్‌పో

కాజీపేట అర్బన్‌ : నిట్‌ వరంగల్‌లోని సీఆర్‌ఐఎఫ్‌ (సెంట్రల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్ట్రూమెంటేషన్‌ ఫెసిలిటీ) భవనంలో బుధవారం ఏర్పాటుచేసిన టెమ్‌ (ట్రాన్స్‌మిషన్‌ ఎలక్ట్రాన్‌ మైక్రోస్పోపీ) స్పెసిమెన్‌ ప్రిపరేషన్‌ పరికరాల ఎక్స్‌పోను నిట్‌ డైరెక్టర్‌ బిద్యాధర్‌ సుబుదీ ప్రారంభించి మాట్లాడారు. నానో టెక్నాలజీలో నూతన ఆవిష్కరణలకు వేదికగా ఎక్స్‌పో నిలవాలని ఆకాంక్షించారు. నిట్‌తోపాటు వివిధ విద్యాసంస్థల విద్యార్థులకు, పరిశోధకులకు, శాస్త్రవేత్తలకు తోడ్పడుతుందన్నారు. కార్యక్రమంలో డీన్‌ అకాడమీ శరత్‌బాబు, ప్రొఫెసర్‌ శ్రీలక్ష్మి, విద్యార్థులు పాల్గొన్నారు.

బొగ్గు ఉత్పత్తిని పెంచాలి1
1/1

బొగ్గు ఉత్పత్తిని పెంచాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement