
2న యువ వికాసం ప్రొసీడింగ్స్ ఇవ్వాలి
భూపాలపల్లి అర్బన్: జూన్ 2వ తేదీన నిర్వహించే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో రాజీవ్ యువ వికాసం లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. ఈ మేరకు బుధవారం డిప్యూటీ సీఎం హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా కలెక్టర్ రాహుల్శర్మ పాల్గొన్నారు. రాజీవ్ యువ వికాసం పథకం అమలుకు సంబంధించి చేపట్టిన చర్యలను అధికారులకు వివరించారు. ఈ వీసీలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్సింగ్, ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ వెంకటేశ్వరావు, బీసీ సంక్షేమ శాఖ అధికారి క్రాంతికిరణ్, ఎస్సీ అభివృద్ధి అధికారిణి సునీత తదితరులు పాల్గొన్నారు.