చెక్‌ బౌన్స్‌ కేసులను పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

చెక్‌ బౌన్స్‌ కేసులను పరిష్కరించాలి

May 1 2025 1:13 AM | Updated on May 2 2025 2:42 PM

భూపాలపల్లి అర్బన్‌: వచ్చే స్పెషల్‌ లోక్‌ అదాలత్‌లో పెండింగ్‌లో ఉన్న చెక్‌బౌన్స్‌ కేసులను పరిష్కరించాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి నాగరాజు ఆదేశించారు. న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో బ్యాంకు మేనేజర్లు, న్యాయవాదులతో బుధవారం సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ.. బ్యాంకులు, కోర్టులలో పెండింగులో ఉన్నటువంటి చెక్‌ బౌన్స్‌ కేసులను పరిష్కారం చేయడానికి బ్యాంకు మేనేజర్లు, న్యాయవాదులు కలిసిరావాలని అన్నారు. 

ఆర్థిక నేరాలను కట్టడి చేయడం అవసరమన్నారు. జూన్‌ 9వ తేదీ నుంచి 14వ తేదీ వరకు నిర్వహించే స్పెషల్‌ లోక్‌ అదాలత్‌లో పెద్దఎత్తున పరిష్కారం చేసేందుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి అఖిల, బార్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి శ్రావణ్‌రావు, న్యాయవాదులు రవీందర్‌, విష్ణువర్ధన్‌రావు, రాజేందర్‌, కవిత, ప్రియాంక, శివకుమార్‌, రాకేష్‌, రమేష్‌ పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement