వైద్యశిబిరానికి విశేష స్పందన | - | Sakshi
Sakshi News home page

వైద్యశిబిరానికి విశేష స్పందన

Mar 24 2025 6:54 AM | Updated on Mar 24 2025 6:54 AM

వైద్యశిబిరానికి విశేష స్పందన

వైద్యశిబిరానికి విశేష స్పందన

భూపాలపల్లి అర్బన్‌: జిల్లాకేంద్రంలోని ఏఐటీయూసీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన వైద్యశిబిరానికి విశేష స్పందన లభించింది. మెడికవర్‌ హాస్పిటల్‌ నేతృత్వంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్యశిబిరం నిర్వహించారు. ఈ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏఐటీయూసీ బ్రాంచ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మాతంగి రామచందర్‌, అసిస్టెంట్‌ బ్రాంచ్‌ సెక్రటరీ గురిజపల్లి సుధాకర్‌రెడ్డి, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సతీష్‌ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. సుమారు 500 మందికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. మెడికవర్‌ హాస్పిటల్‌ వైద్య బృందం ఆధ్వర్యంలో అందరికీ ఉచిత పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకులు మాట్లాడుతూ కార్మికుల సంక్షేమంతో పాటు వారి ఆరోగ్యమే లక్ష్యంగా మెడికవర్‌ హాస్పిటల్‌ మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు తాళ్ల పోశం, నేరెళ్ల జోసెఫ్‌ వేముల శ్రీకాంత్‌, డాక్టర్లు షఫీ పాలగిరి, డాక్టర్‌ శ్రవణ్‌ కుమార్‌ జోగు, టుది ఎకో ప్రకాశ్‌, పీఆర్‌ఓ రాజు, జూనియర్‌ డాక్టర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement