ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి

Feb 26 2025 8:38 AM | Updated on Feb 26 2025 8:38 AM

ములుగు డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు

ములుగు రూరల్‌: ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని ములుగు జిల్లా వైద్యాధికారి గోపాల్‌రావు అన్నారు. ఈ మేరకు మంగళవారం రాయినిగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని జాకారం ఆయుష్మాన్‌ మందిర్‌ను జాతీయ నాణ్యత ప్రమాణాల వర్చువల్‌ అసెస్‌మెంట్‌ కార్యక్రమంలో భాగంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ నాణ్యత ప్రమాణాల సర్టిఫికేషన్‌ పొందడం వల్ల ఆరోగ్య కేంద్రంలో సదుపాయాలు, ప్రజలకు నాణ్యతతో కూడిన వైద్యం అందుతుందన్నారు. ఆయుష్మాన్‌ మందిర్‌లో సమన్వయంతో పనిచేస్తున్న సిబ్బందిని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ విపిన్‌కుమార్‌, జిల్లా అసంక్రమిత వ్యాధుల నియంత్రణాధికారి పవన్‌కుమార్‌, ప్రోగ్రాం ఆఫీసర్‌ శ్రీకాంత్‌, పీహెచ్‌సీ వైద్యాధికారి ప్రసాద్‌, వైద్యుడు నాగ అన్వేష్‌, డెమో సంపత్‌, ఆరోగ్య కార్యకర్తలు తిరుమల, సుజాత, స్వర్ణలత, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement