ధనుర్మాసం..ధార్మికశోభ
పాలకుర్తి టౌన్: గోదాదేవి వ్రతాలు, కల్యాణాలతో మండలంలోని వల్మిడి శ్రీసీతారామచంద్రస్వామి ఆలయం, శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయాలు ధనుర్మాస శోభ సంతరించుకోనున్నాయి. ఈనెల 16 నుంచి ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. భక్తులు ఈ నెలంతా తెల్లవారుజామున తీర్థసాన్నాలు ఆచరించి దైవరాధన చేస్తారు. ఈ మాసంలో గోదాదేవి, శ్రీరంగనాయకసావమిని వేకువజామున దర్శించుకోవడం గొప్ప యోగంగా భావిస్తారు. ఈనెల 30న వైకుంఠ ఏకాదశిని వైభవంగా నిర్వహించేందుకు ఆలయ ఆధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఆ రోజు ఉత్తర ద్వారం గుండా శ్రీవిష్ణుమూర్తిని దర్శించుకుంటారు.
● ఈనెల 16 నుంచి వైష్ణవ ఆలయాల్లో పూజలు
● ముస్తాబైన వల్మిడి శ్రీసీతారామచంద్రస్వామి ఆలయం


