పోస్టల్‌ బ్యాలెట్‌ పంపిణీ సక్రమంగా చేయాలి | - | Sakshi
Sakshi News home page

పోస్టల్‌ బ్యాలెట్‌ పంపిణీ సక్రమంగా చేయాలి

Dec 4 2025 7:34 AM | Updated on Dec 4 2025 7:34 AM

పోస్టల్‌ బ్యాలెట్‌ పంపిణీ సక్రమంగా చేయాలి

పోస్టల్‌ బ్యాలెట్‌ పంపిణీ సక్రమంగా చేయాలి

జనగామ రూరల్‌: పంచాయతీ ఎన్నికల సందర్భంగా పోస్టల్‌ బ్యాలెట్‌ పత్రాలను సర్వీస్‌ ఓటర్లకు, ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులకు సరిగ్గా పంపిణీ చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌ ఆదేశించారు. పోస్టల్‌ బ్యాలెట్‌ పంపిణీ, నిర్వహణపై బుధవారం అదనపు కలెక్టర్‌ పింకేశ్‌ కుమార్‌తో కలిసి జెడ్పీ సీఈఓ, డీపీఓ, ఎంపీడీఓలు, తహసీల్దార్‌లతో, ఎంపీఓలతో గూగుల్‌ మీట్‌ ద్వారా సమీక్షించారు. పోస్టల్‌ బ్యాలెట్‌ పంపిణీ, నిర్వహణ తదితర అన్ని ప్రక్రియలకు సంబంధించి మాస్టర్‌ ట్రైనర్‌ రామరాజు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా అధికారులకు అవగాహన కల్పించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ..మొదటి విడత పోలింగ్‌ జరిగే మండలాల్లో ఈ నెల 9వ తేదీన ఎంపీడీఓ కార్యాలయంలో పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం ఫెసిలిటేషన్‌ కేంద్రానికి అవసరమైన ఏర్పా ట్లు చేయాలన్నారు. మొదటి విడత పోలింగ్‌ జరిగే మండలాల్లో ఈ నెల 6 న పోలింగ్‌ అధికారులకు రెండో విడత శిక్షణ కార్యక్రమం ఉంటుందన్నారు.

ఎన్నికల అధికారి,

కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement