ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలుచేయాలి | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలుచేయాలి

Oct 24 2025 7:42 AM | Updated on Oct 24 2025 7:42 AM

ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలుచేయాలి

ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలుచేయాలి

ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలుచేయాలి

పాలకుర్తి టౌన్‌: ప్రతీ గ్రామంలో ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా అమలుకావాలని ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అన్నారు. గురువారం పాలకుర్తి నియోజవర్గ అభివృద్ధి పనుల పురోగతిపై నియోజకవర్గ పంచాయతీరాజ్‌ శాఖ ఉన్నతాధికారులతో హైదరాబాద్‌లో ఎమ్మెల్యే నివాసంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని రహదారి నిర్మాణాలు, గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి, డ్రైనేజీ వ్యవస్థలు పంచాయతీ స్ధాయిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో రహదారి మరమ్మతులు, బావుల పునరుద్ధరణ, పంచాయతీ భవనాల నిర్మాణం వంటి పనులను వేగవంతం చేయాలని అధికారులను సూచించారు. సమీక్షలో పంచాయతీరాజ్‌ డీఈ రామలింగాచారి, ఏఈ శ్రీనివాస్‌నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement