జనగామ: జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంట లో చేపట్టిన అభివృద్ధి పనుల్లో వేగం పెంచాల ని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. బుధవారం అదనపు కలెక్టర్ పింకేష్కుమార్తో కలిసి పనులను పరిశీలించిన ఆయన.. మాట్లాడుతూ బతుకమ్మకుంట అభివృద్ధి పనులకు రూ.కోటి 50 లక్షలు మంజూరయ్యాయని, పంచతంత్ర థీమ్తో డెవలప్ చేస్తున్నట్లు చెప్పారు. సుందరీకరణ నేపథ్యంలో గ్రిల్స్, కాలిబాట, గజి బోలు, లైటింగ్, వ్యాయామం, ఆట పరికరా లు, చిన్నారుల ఆటస్థలం, మినీ పార్కు ఏర్పా టు పనులను మరో 15 రోజుల్లో పూర్తి చేయాలని చెప్పారు. అలాగే కుంట పూడికతీత పనులను త్వరతగతిన పూర్తి చేయాలని ఆదేశించా రు. కలెక్టర్ వెంట మున్సిపల్ డీఈ రాజ్కుమార్, ఏఈ మహిపాల్ ఉన్నారు.
సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలి
జనగామ రూరల్: ప్రజలకు వైద్య సేవలు అందించడంతోపాటు సీజనల్ వ్యాధులపై అవగా హన కల్పించాలని డీఎంహెచ్ఓ మల్లికార్జున్రావు అన్నారు. వడ్లకొండ పీహెచ్సీని ఆయన బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. ఆస్పత్రి రికార్డులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రభుత్వ కార్యక్రమాలను విధిగా అమలు చేయాలని చెప్పారు. చిన్నారులకు వ్యాక్సిన్లు తప్పనిసరిగా వేయించాలని, సిబ్బంది ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు సకాలంలో ఆరోగ్య కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. రికార్డులను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని ఆదేశించారు.
నిట్లో టెమ్ ఎక్స్పో
కాజీపేట అర్బన్ : నిట్ వరంగల్లోని సీఆర్ఐఎఫ్ (సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్ట్ట్రుమెంటేషన్ ఫెసిలిటీ) భవనంలో బుధవారం ఏర్పాటుచేసిన టెమ్ (ట్రాన్స్మిషన్ ఎలక్ట్రాన్ మైక్రోస్పోపీ) స్పెసిమెన్ ప్రిపరేషన్ పరికరాల ఎక్స్పోను నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ ప్రారంభించి మాట్లాడారు. నానో టెక్నాలజీలో నూత న ఆవిష్కరణలకు వేదికగా ఎక్స్పో నిలవాలని ఆకాంక్షించారు. నిట్తోపాటు వివిధ విద్యాసంస్థల విద్యార్థులకు, పరిశోధకులకు, శాస్త్రవేత్తలకు తోడ్పడుతుందన్నారు. కార్యక్రమంలో డీన్ అకాడమీ శరత్బాబు, ప్రొఫెసర్ శ్రీలక్ష్మి, విద్యార్థులు పాల్గొన్నారు.
వరంగల్లో సీజీహెచ్ఎస్ వెల్నెస్ సెంటర్
హన్మకొండ చౌరస్తా: త్వరలో వరంగల్లో సీజీహెచ్ఎస్ వెల్నెస్ సెంటర్ ప్రారంభమవుతుందని వరంగల్ పార్లమెంట్ సభ్యురా లు డాక్టర్ కడియం కావ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వెల్నెస్ సెంటర్కు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపిన ట్లు ఆ శాఖ అదనపు కార్యదర్శి రోలీసింగ్ లేఖ రాశారని పేర్కొన్నారు. అవసరమైన పోస్టుల భర్తీకి డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్నుంచి ఆమోదం కూడా లభించినట్లు పేర్కొన్నారు. ఈ వెల్నెస్ సెంటర్ ద్వారా వైద్య చికిత్సలు, వ్యాధి నిర్ధారణ తదితర సదుపాయాలు కలుగుతాయని తెలిపారు. సీజీహెచ్ఎస్ వెల్నెస్ సెంటర్ ఏర్పాటుకు కృషి చేసిన ఎంపీ కావ్యకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
క్రైం ఏసీపీగా సదయ్య
హసన్పర్తి: వరంగల్ పోలీస్ కమిషనరేట్ క్రైం ఏసీపీగా సదయ్య నియమితులయ్యారు. సీఐడీ విభాగంలో పనిచేసిన ఆయన బదిలీపై ఇక్కడికిచ్చారు. ఈ మేరకు బుధవారం సదయ్య బాధ్యతలు చేపట్టారు. గతంలో ఆత్మకూర్లో ఎస్సైగా, కేయూసీ, సుబేదారి పోలీస్స్టేషన్లో ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహించారు.