
వన్ నేషన్.. వన్ ఎలక్షన్తోనే అభివృద్ధి..
జనగామ రూరల్: వన్ నేషన్.. వన్ ఎలక్షన్తోనే దేశం అభివృద్ధి చెందుతుందని బీజేపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ తివారీ అన్నారు. పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్ ఆధ్వర్యాన ‘వన్ నేషన్.. వన్ ఎలక్షన్’పై బుధవారం నిర్వహించి న అవగాహన సదస్సులో ఆయన మాట్లాడా రు. ఓకే దేశం.. ఓకే ఎన్నిక వలన ఎన్నికల నిర్వహణ ఖర్చు తగ్గి లక్షల కోట్ల రూపాయలు దుర్వినియోగం కాకుండా ఉంటుందని చెప్పా రు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఒకే సమయంలో పనిచేయడంతో సమన్వయం పెరుగుతుందని, అభివృద్ధి ప్రణాళికలు వేగంగా అమలు అవుతా యని పేర్కొన్నారు. పాలన, రాజకీయ స్థిరత్వం, అభివృద్ధిలో గుణాత్మక మార్పునకు మార్గం సుగమం అవుతుందని వివరించారు. ఎన్నికల కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఒక వ్యక్తికి 1,400 రూపాయలు ఖర్చవుతుందని, దేశంలో ఎన్ని సార్లు ఎన్నికలు జరిగినా 60 శాతం మంది మాత్రమే ఓటు వేస్తున్నారని, ఓటింగ్ శాతం పెరగాలంటే ఒకేసారి ఎన్నికలు రావాలని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, మాజీ మంత్రి విజయరామారావు, మాజీ ఎంపీ సీతారాం నాయక్, నందారెడ్డి, లేగ రామ్మోహన్రెడ్డి, కేవీఎల్ఎన్.రెడ్డి, పజ్జూరి లక్ష్మీనర్సయ్య, ఉడుగుల రమేశ్, శశిధర్ రెడ్డి, కల్నాల్ మాచర్ల భిక్షపతి, బొమ్మకంటి అనిల్ తదితరులు పాల్గొన్నారు.
‘బాల పురస్కార్’కు దరఖాస్తుల ఆహ్వానం
జనగామ రూరల్: ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డులకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సంక్షేమాధికారి డి.ఫ్లోరెన్స్ ఒక ప్రకటనలో తెలిపారు. 5 నుంచి 18 ఏళ్ల లోపు బాలబాలికలు వివిధ రంగాల్లో సాహసం, ధైర్యసాహసాలు, క్రీడలు, సామాజిక సేవ, సైన్స్, టెక్నాలజీ, పర్యావరణం, కళలు, సంస్కృతి తదితర అంశాలలో ప్రతిభ కనబర్చిన వారికి 2025 సంవత్సరం ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలను ప్రదానం చేయనున్నట్లు పేర్కొన్నారు. జూలై 31లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలో సంప్రదించాలన్నారు.
● బీజేపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ తివారీ