ఎన్‌కౌంటర్లపై న్యాయ విచారణ చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

ఎన్‌కౌంటర్లపై న్యాయ విచారణ చేపట్టాలి

May 29 2025 7:23 AM | Updated on May 29 2025 7:23 AM

ఎన్‌కౌంటర్లపై న్యాయ విచారణ చేపట్టాలి

ఎన్‌కౌంటర్లపై న్యాయ విచారణ చేపట్టాలి

జనగామ రూరల్‌ : మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావుతోపాటు పలువురి ఎన్‌కౌంటర్లపై కేంద్ర ప్రభుత్వం న్యాయ విచారణకు ముందుకు రాకపోతే సుప్రీంకోర్టు కేసును సుమోటోగా స్వీకరించి న్యాయ విచారణకు ఆదేశించాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని గబ్బెట గోపాల్‌రెడ్డి భవన్‌లో కావటి యాదగిరి ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన జిల్లా కౌన్సిల్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. కొంతకాలంగా జరుగుతున్న మావో యిస్టుల, ఆదివాసీల ఎన్‌కౌంటర్లతో పాటు ఆపరేష న్‌ కగార్‌ను విచారణ అంశంలో చేర్చాలని కోరారు. స్థానిక ప్రజల హక్కులు, వనరుల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడుతున్న వారిని ఏకపక్షంగా ఎన్‌కౌంటర్‌ చేయడం శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్య అని అన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సీహెచ్‌.రాజారెడ్డి, పాతూరి సుగుణమ్మ, ఆది సాయన్న, శ్రీనివాస్‌, యాకూబ్‌, కె.యాదగిరి, చొప్పరి సోమయ్య, జువారి రమేశ్‌, రావుల సదానందం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement