సహధర్మచారిణి పక్కనే ‘ముందస్తు స్థలం’ | - | Sakshi
Sakshi News home page

సహధర్మచారిణి పక్కనే ‘ముందస్తు స్థలం’

May 26 2025 1:10 AM | Updated on May 26 2025 1:10 AM

సహధర్మచారిణి పక్కనే ‘ముందస్తు స్థలం’

సహధర్మచారిణి పక్కనే ‘ముందస్తు స్థలం’

దేవరుప్పుల: సహధర్మచారిణి కాలం చెల్లడంతో తనకు కూడా ఎన్నడైన తప్పదనే ముందస్తు చూపుతో తన భార్య స్మారక విగ్రహం పక్కనే స్థలం కేటాయించుకోవడం ప్రత్యేకత సంతరించుకుంది. దేవరుప్పుల మండలంలోని సీతారాంపురంకు చెందిన ఆవుల ఉప్పలయ్య భార్య మైసమ్మ ఏదాది క్రితం అకస్మికంగా మృతి చెందింది. దీంతో తన వ్యవసాయ క్షేత్రం వద్ద తన భార్య స్మారక విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఇటీవల ఆవిష్కరించారు. అయితే ఈ స్మారక విగ్రహం పక్కనే భవిష్యత్‌లో తన విగ్రహం పెట్టేందుకు సెంటిమెంట్‌గా కుడిభాగాన స్థలం కేటాయించుకోవడం వారి అన్యోన్య దాంపత్యానికి అద్దం పడుతుంది. కాగా వీరి ముగ్గురు కుమారుల్లో ఇద్దరు దేశ రక్షణ విభాగంలో సైనికులు కాగా మరొకరు సివిల్‌ కానిస్టేబుల్‌ కావడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement