
రైతులకు ఇబ్బందులే..
మార్క్ఫెడ్ సంస్థ నిబంధనలు రైతులకు ఇబ్బంది కలిగించేవిగా ఉన్నాయి. ఆ నిబంధనలు పాటించలేక రైతులు తక్కువ ధరకు దళారులకు విక్రయించే అవకాశం ఉంది. ఇలాగైతే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా రైతులకు పెద్దగా ఉపయోగం ఉండదు.
– మారు మురళీధర్ రెడ్డి, మెట్పల్లి
నిబంధనలు తప్పనిసరి
కొనుగోలు కేంద్రాలకు మక్కలు తెచ్చే రైతులు తప్పనిసరిగ్గా నిబంధనలు పాటించాలి. గింజల్లో 14 తేమశాతం కంటే ఎక్కువ ఉంటే ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు చేయం. ఈ సారి బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తున్నాం. రైతులందరూ తప్పకుండా సహకరించాలి.
– ఎండీ.హబీబ్, మార్క్ఫెడ్ అధికారి

రైతులకు ఇబ్బందులే..