
కడుపునొప్పితో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
మల్యాల: కడుపునొప్పితో మండలంలోని రామన్నపేటకు చెందిన ఇంటర్ విద్యార్థిని హారిక (16) ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై నరేశ్కుమార్ కథనం ప్రకారం.. వెల్గటూర్ మండలం గొడిశెలపేటకు చెందిన ఒడిగ గంగాధర్, వరలక్ష్మి దంపతులు 15 ఏళ్ల క్రితం రామన్నపేటకు వచ్చి ఇక్కడే ఉంటున్నారు. గంగాధర్ లారీ డ్రైవర్. తల్లి వ్యవసాయ కూలీ. వీరి రెండో కూతురు హారిక జగిత్యాలలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతుండగా ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటోంది. అయినప్పటికీ తగ్గకపోవడంతో ఆదివారం ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వరలక్ష్మీ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
పెగడపల్లి: మండలంలోని ఎల్లాపూర్కు చెందిన మల్లారపు సుప్రియ (27) చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతిచెందింది. ఎస్సై కిరణ్కుమార్ కథనం ప్రకారం.. సుప్రియ కొంతకాలంగా థైరాయిడ్ వ్యాధితో బాధపడుతోంది. ఇటీవలే కామెర్ల వ్యాధిబారిన పడింది. ఆసుపత్రుల్లో చూపించుకున్నా ఆరోగ్యం కుదటపడలేదు. జీవితంపై విరక్తి చెంది ఈనెల 12న బ్లాక్రోజ్ పౌడర్ తాగింది. చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. సుప్రియ తండ్రి అంజయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.
● రూ.1.25లక్షలు కాజేసిన కేటుగాడు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్కు చెందిన ఒక వ్యక్తికి ముద్రలోన్ ఆఫీసర్ అని ఫోన్ చేసి రూ.5 లక్షల లోన్ ఇప్పిస్తానని నమ్మబలికాడు. ప్రాసెసింగ్ ఫీజుగా పలు దఫాలుగా రూ.1.25లక్షలు కాజేశాడు. అయినా లోన్ మంజూరుకాకపోవడంతో బాధితుడు ఆదివారం పోలీసులను ఆశ్రయించాడు. ఎస్సై కె.రాహుల్రెడ్డి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైనా సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930కు కాల్ చేయాలని సూచించారు.

కడుపునొప్పితో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య