చరిత్రకు సాక్ష్యం ఎలగందుల ఖిలా | - | Sakshi
Sakshi News home page

చరిత్రకు సాక్ష్యం ఎలగందుల ఖిలా

Sep 15 2025 8:21 AM | Updated on Sep 15 2025 8:21 AM

 చరిత్రకు సాక్ష్యం ఎలగందుల ఖిలా

చరిత్రకు సాక్ష్యం ఎలగందుల ఖిలా

చరిత్రకు సాక్ష్యం ఎలగందుల ఖిలా

కొత్తపల్లి(కరీంనగర్‌): చరిత్రకు సాక్ష్యంగా కొత్తపల్లి మండలంలోని ఎలగందుల ఖిలా నిలుస్తోంది. కాకతీయులు, కులీకుతుబ్‌షాహీల శిల్ప కళావైభవానికి ప్రతీకగా ఖిలాలోని కట్టడాలు నిలుస్తున్నాయి. ఈ కోటలో టర్కీ, ఫ్రెంచ్‌ ఇంజినీర్ల ప్రభావం కనిపిస్తోంది. ఫ్రెంచి, టర్కీ ఇంజినీర్ల ప్రభావంతో ఈ కోట అనేక విషయాల్లో మధ్యయుగపు ఐరోపా శైలిని పోలి ఉంది. 200 అడుగుల ఎత్తు, 2.5 మైళ్ల విస్తీర్ణంలో మానేరునదిని ఆనుకొని ఉంది. ఎలగందుల కోటను కాకతీయులు 1083– 1323 మధ్య నిర్మించారు. ఈ కోటకు మొదటి పేరు ‘వెలిగుండుల’. దీనిని ముసునూరి నాయకులు, రాచర్ల పద్మనాయకులు ధృడంగా తయారు చేశారు. కోట చుట్టూ సుమారు 5 కిలోమీటర్ల వెడల్పు, 4 మీటర్ల లోతు నీటి కందకాన్ని తవ్వించి మొసళ్లతో నింపి శత్రువుల నుంచి రక్షణగా ఏర్పాటు చేశారు. 16వ శతాబ్దంలో ఈ కోటను కుతుబ్‌షాహీలు ఆక్రమించారు. తర్వాత మొఘల్‌ సామ్రాజ్యాధీనంలోకి వచ్చింది. హైదరాబాద్‌ నిజాం పాలనలో నిజాం ఉల్‌ ముల్క్‌ అసఫ్‌జాహి (1724–1748) కాలంలో అమీన్‌ఖాన్‌ ఈ కోట ఖిలేదార్‌గా బాధ్యతలు చేపట్టారు. 1754లో నవాబ్‌ సలాబత్‌ జంగ్‌ కాలంలో మీర్జా ఇబ్రహీం దంసా ఈ కోటను పునర్‌నిర్మించారు. 1905లో ఆరో నిజాం మహబూబ్‌ అలీఖాన్‌ జిల్లా కేంద్రాన్ని ఎలగందుల్‌ నుంచి కరీంనగర్‌కు మార్చారు. కోటలో నీలకంఠస్వామి, లక్ష్మీనరసింహస్వామి ఆలయాలతోపాటు మసీదు హిందూ, ముస్లింల ఐక్యతకు ప్రతీకగా నిలుస్తున్నాయి.

ఎలగందుల ఖిలా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement