యమధర్మరాజుకు పూజలు | - | Sakshi
Sakshi News home page

యమధర్మరాజుకు పూజలు

Jun 23 2025 5:50 AM | Updated on Jun 23 2025 5:50 AM

యమధర్

యమధర్మరాజుకు పూజలు

ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి అనుబంధం యమధర్మరాజు ఆలయంలో ఆదివారం భక్తులు పూజలు చేశారు. ఆలయ ఈవో శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో వేదపండితులు బొజ్జ సంపత్‌కుమార్‌ మంత్రోచ్ఛరణల మధ్య స్వామివారికి రుద్రాభిషేకం, మన్యసూక్తం, ఆయుష్యసూక్తం, అభిషేకం నిర్వహించారు. హోమం, హారతి, మంత్రపుష్పం గావించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్‌ జక్కు రవీందర్‌, ఽట్రస్టు సభ్యులు, సూపరింటెండెంట్‌ కిరణ్‌ తదితరులున్నారు.

ఆయిల్‌ పాం సాగుపై రైతులకు అవగాహన

ధర్మపురి: ఆయిల్‌ పాం సాగుపై మండలంలోని నేరెల్ల గ్రామంలో రైతులకు ఆదివారం అవగాహన కల్పించారు. ఉధ్యానవన శాఖ, లోహియా ఎడిబుల్‌ ఆయిల్స్‌ వారి ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఆయిల్‌ పాం సాగు చేసే రైతులకు ప్రభుత్వం సబ్సిడీలు, మద్దతు అందిస్తోందని తెలిపారు. బుగ్గారం మండలంలో సెప్టెబర్‌ 4న ఆయిల్‌ పాం ఫ్యాక్టరీకి భూమిపూజు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం సాగు చేసిన రైతులను సన్మానించారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు జాజాల రమేశ్‌, జిల్లా మానిటరింగ్‌ అధికారి అన్వేశ్‌, ఫీల్డు ఆఫీసర్‌ రమణ, శ్రీయ తదితరులున్నారు.

ఇజ్రాయిల్‌లో భయం భయంగా తెలుగువారు

జగిత్యాలక్రైం: ఇజ్రాయిల్‌, ఇరాన్‌ యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయిల్‌లో వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న తెలుగువారు మూడు రోజులుగా భయంభయంగా గడుపుతున్నారు. ఇజ్రాయిల్‌పై ఇరాన్‌ బాంబుల వర్షం కురిపిస్తుండటంతో అక్కడి ప్రజలను అప్రమత్తం చేశారు. తెలుగువారిని కూడా క్షేమంగా ఉండే ప్రాంతాలకు తరలించినట్లు అక్కడున్న జిల్లా వాసులు తెలిపారు. నాలుగురోజులుగా భీకర యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో పనులు నిలిపివేసి బంకర్లలోనే ఉంటున్నట్లు పేర్కొన్నారు. సెల్‌ఫోన్‌ నెట్‌వర్క్‌ కూడా తీవ్ర అంతరాయం ఉందని తెలిపారు. విమాన సర్వీసులు మొదలైతే స్వదేశం వస్తామని జిల్లా వాసులు తెలిపారు.

లోక్‌ అదాలత్‌లో రాజీతో వాకర్స్‌ అసోసియేషన్‌ ఎన్నిక

జగిత్యాలజోన్‌: లోక్‌ అదాలత్‌లో రాజీతో జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియం వాకర్స్‌ అసోసియేషన్‌ కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. ఈ ఎన్నికపై కొందరు గతంలో కోర్టుకు వెళ్లారు. ఇరువర్గాల మధ్య ఇటీవల నిర్వహించిన లోక్‌ అదాలత్‌లో రాజీ కుదిరింది. అధ్యక్ష స్థానానికి నేరేళ్ల వెంకన్న, కాయితి శ్రీనివాస్‌ పోటీపడ్డారు. ఈ ఎన్నికల్లో 477 ఓట్లకు 401 పోలయ్యాయి. నేరేళ్ల వెంకన్నకు 271 ఓట్లు, శ్రీనివాస్‌కు 129 ఓట్లు వచ్చాయి. దీంతో వెంకన్న గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు నాగభూషణం, నాగేంద్రం, మల్లికార్జున్‌, శ్రీనివాస్‌ ప్రకటించారు. ప్రధాన కార్యదర్శిగా మెరుగు శ్రీనివాస్‌, ఉపాధ్యక్షుడిగా తోడేటి లచ్చయ్య, సహాయ కార్యదర్శిగా మహేందర్‌రావు, కోశాధికారిగా అనంతుల విటలయ్య ఎన్నికయ్యారు.

జానపద కళా పురస్కార్‌కు రాజేందర్‌

ధర్మపురి: జానపద కళారంగంలో ప్రతిభ కనపర్చిన పలిగిరి రాజేందర్‌ రాష్ట్ర జానపద కళాపురస్కార్‌ అవార్డుకు ఎంపికయ్యాడు. మండలంలోని నేరెల్లకు చెందిన రాజేందర్‌ 25ఏళ్లుగా జానపదరంగంలో జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో వేలాది ప్రదర్శనలిచ్చారు. ప్రజలను చైతన్యవంతులు చేశారు. ఈ నెల 21న పెద్దపెల్లి జిల్లా బసంతనగర్‌లో స్థాపించిన ఆలయ ఫౌండేషన్‌ వారు అందించిన జానపద కళాపురస్కార్‌ అవార్డును మాజీ ఎంపీ వెంకటేష్‌ నేత చేతుల మీదుగా అందుకున్నారు.

యమధర్మరాజుకు పూజలు1
1/1

యమధర్మరాజుకు పూజలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement