
భక్తులకు వసతి కల్పించాలి
కొండగట్టు ఆంజనేయస్వామి వారిని దర్శించుకునేందుకు వ చ్చే భక్తులకు వసతి సౌకర్యాలు కల్పించాలి. కొండపై గదుల కొరతతో దిగువ కొండగట్టులో ప్రైవేట్ లాడ్జీల్లో ఉండాల్సి వ స్తోంది. కొండపై మాస్టర్ ప్లాన్ అమలు చేసి, భక్తులు ఇబ్బందులు పడకుండా మరిన్ని గదుల నిర్మా ణం చేపట్టాలి. – జక్కుల రాయమల్లు, మల్యాల
మాస్టర్ ప్లాన్ అమలు చేయాలి
కొండగట్టు ఆంజనేయస్వామి భక్తుల పాలిట కొంగుబంగారం. కోరిన కోరికలు తీర్చే దేవుడు. మాస్టర్ ప్లాన్ అమలుతో భక్తులకు సౌకర్యాలు పెరగటంతోపాటు, ఆలయ అభివృద్ధికి బాటలు పడుతాయి. మాస్టర్ ప్లాన్ అమలు కోసం అధికారులు చొరవ తీసుకొని, ఆలయ అభివృద్ధికి కృషి చేయాలి. – ఇట్టిరెడ్డి అంజిరెడ్డి, గుడిపేట
సౌకర్యాలకు కృషి చేస్తున్నాం..
ఆలయానికి వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నాం. ఆంధ్ర ప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ను కలిసి టీటీడీ ద్వారా 100గదుల నిర్మాణానికి కృషి చేస్తాం. భక్తుల కోసం వైజంక్షన్ సమీపంలో షెల్టర్ నిర్మించాం. మరో షెల్టర్ నిర్మాణానికి కృషి చేస్తున్నాం. – శ్రీకాంత్రావు, కొండగట్టు ఆలయ ఈఓ

భక్తులకు వసతి కల్పించాలి

భక్తులకు వసతి కల్పించాలి

భక్తులకు వసతి కల్పించాలి