జగిత్యాల: పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల మేధస్సుకు పదును పెట్టడానికి, వారిలోని వినూత్న ఆలోచనలను బహిర్గతం చేసేందుకు ఇన్స్పైర్ అవార్డ్ మానిక్ వేదికగా ఉంటుందని, ఇందులో విద్యార్థులందరూ పాల్గొనాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. ఇన్స్పైర్ అవార్డ్స్ మానక్కు సంబంధించిన పోస్టర్ను సోమవారం ఆవిష్కరించారు. జిల్లాలోని అన్ని యాజమాన్యాల్లో 6 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ఇన్స్పైర్ అవార్డుల కోసం నామినేషన్ వేయాలన్నారు. డీఈవో రాము మాట్లాడుతూ ప్రతీ పాఠశాల నుంచి 5 ప్రాజెక్ట్లు రూపొందించాలని, జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యేలా విద్యార్థులను ప్రోత్సహించాలన్నారు. ఎస్సీ వెల్ఫేర్ అధికారి రాజ్కుమార్, కో–ఆర్డినేటర్ సత్యనారాయణ, జిల్లా సైన్స్ అధికారి మచ్చ రాజశేఖర్ పాల్గొన్నారు.
ఒలింపిక్ రన్ టార్చ్ ర్యాలీ
జగిత్యాల/మెట్పల్లి: ఒలింపిక్ దినోత్సవం సందర్భంగా మెట్పల్లిలో ఒలింపిక్ రన్ టార్చ్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక అయ్యప్ప స్వామి ఆలయం వద్ద ప్రారంభమైన ర్యాలీ ప్రధాన వీధుల మీదుగా కొనసాగింది. ముత్తయ్య, అశోక్, కార్తీక్, గంగాధర్, క్రీడాకారులు పాల్గొన్నారు. అంతర్జాతీయ ఒలంపిక్ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం 2కే రన్లో పాల్గొన్నారు. జిల్లాకేంద్రంలో నిర్వహించిన ర్యాలీలో అదనపు కలెక్టర్ బీఎస్.లత పాల్గొన్నారు. క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయులు, విద్యార్థులు, జిల్లా క్రీడల శాఖ అధికారి రవికుమార్ పాల్గొన్నారు.
సింగరేణి పాలిటెక్నిక్లో ప్రవేశాలు
యైటింక్లయిన్కాలనీ: మంచిర్యాల జిల్లా సీసీసీ– నస్పూర్లోని సింగరేణి పాలిటెక్నిక్లో 2025–26 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని సింగరేణి ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యదర్శి గుండా శ్రీనివాస్ సోమవారం తెలిపారు. కళాశాలలో మొత్తం 300 సీట్లు భర్తీచేస్తామన్నారు. సివిల్, కంప్యూటర్స్, ఎలిక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, మెకానికల్, మైని ంగ్ కోర్సుల్లో 60 చొప్పున సీట్లు ఖాళీగా ఉన్నాయని, పాలిసెట్–2025లో ర్యాంకుల ఆధారంగా సీట్లు కేటాయిస్తామన్నారు. ఈ నెల 28 నుంచి వచ్చే నెల మూడో తేదీవరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
ఇన్స్పైర్లో పాల్గొనండి
ఇన్స్పైర్లో పాల్గొనండి