
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
కరీంనగర్రూరల్: చొప్పదండి మండలం వెదురుగట్టకు చెందిన విష్ణువర్థన్(29) బహుదూర్ఖాన్పేట శివారులో ద్విచక్ర అదుపు తప్పి కింద పడడంతో మృతి చెందాడు. కరీంనగర్రూరల్ సీఐ ఏ.నిరంజన్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నగునూర్లోని ఓ ఆస్పత్రిలో పనిచేస్తున్న విష్ణువర్ధన్ సోమవారం వెదురుగట్ట నుంచి ప్రతిమ ఆసుపత్రికి వస్తుండగా మార్గ మధ్యలోని బహుదూర్ఖాన్పేట వద్ద ద్విచక్ర వాహనం అదుపు తప్పి సమీపంలోని చెట్టుకు ఢీకొంది. తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. తండ్రి పర్శరాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
హుజూరాబాద్: పట్టణానికి చెందిన ఓ న్యూస్ పేపర్ రిపోర్టర్ చిర్ర సుదర్శన్గౌడ్ (55) ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. హుస్నాబాద్లో ఓ శుభకార్యానికి హాజరై తిరిగి వస్తుండగా భీమదేవరపల్లి మండలం గట్ల నర్సింగాపూర్ గ్రామ శివారులో బైక్ అదుపు తప్పడంతో కందకంలో పడి మృతి చెందాడని. మృతుడి కుటుంబానికి తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో రూ.పదివేలు అందజేశారు. మృతుడి కుటుంబ సభ్యులను టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి గాండ్ల శ్రీనివాస్, చంద్రశేఖర్, హుజూరాబాద్ ప్రెస్క్లబ్ అధ్యక్షుడు కాయిత రాములు, జర్నలిస్టులు పరామర్శించారు.
ఖైదీల యోగాక్షేమాలు తెలుసుకున్న జడ్జి
కరీంనగర్క్రైం: కరీంనగర్ జిల్లా జైలును సోమవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి శివకుమార్, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.వెంకటేశ్తో కలిసి సందర్శించారు. ఖైదీల యోగ క్షేమాలు, భోజన వసతులు, న్యాయసేవా, ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకున్నారు. క్యాంటీన్, ఆసుపత్రి, ములాఖత్, ఫోన్, లైబ్రరీ, వంటశాల, ఇండస్ట్రీలలో పనితీరు పరిశీలించారు. కొత్త చట్టాలు వివరించారు. మహిళా జైలును కూడా సందర్శించి కేసుల వివరాలు, బాగోగులు, సౌకర్యాలు అడిగి తెలుసుకున్నారు. లాయర్లను పెట్టుకునే స్థోమత లేనివారికి ప్రభుత్వం తరఫున లాయర్లను నియమిస్తామని చెప్పారు. జైలు సూపరింటెండెంట్ విజయ డేని జైలర్లు పి.శ్రీనివాస్, బి.రమేశ్ తదితరులు ఉన్నారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి