ధర్మపురి: కోనేటి రాయడుకి భక్తులు కోటొక్క దండాలు సమర్పించారు. నర్సింహ నామస్మరణలతో కోనేరు మారుమోగింది. ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయ సమీపంలోని బ్రహ్మపుష్కరిణిలో శనివారం ఉగ్రనృసింహుని డోలోత్సవం, తెప్పోత్సవం కార్యక్రమాలను వైభవంగా జరిపించారు. ఉత్సవమూర్తులను కోనేరులో హంసవాహనంపై ఐదు ప్రదక్షిణలు చేసి తెప్పోత్సవం, అనంతరం భోగ మండపంలోని ఊయలపై ఆసీనులు చేసి డోలోత్సవం నిర్వహించారు. ఆలయ చైర్మన్ జక్కు రవీందర్, ఈవో శ్రీనివాస్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అలాగే స్వామివారల దక్షిణ, ఉత్తర దిగ్యాత్రలకు ధర్మపురి పోలీస్ స్టేషన్ను ముస్తాబు చేశారు. ఆదివారం పూజల కోసం ఠాణా ఆవరణలో ప్రత్యేక వేదిక ఏర్పాటు చేశారు. ఏటా బ్రహ్మోత్సవాల సందర్భంగా లక్ష్మీనృసింహుడు పోలీస్స్టేషన్ను సందర్శించడం ఆనవాయితీ. కాగా స్వామివారి రాకకోసం ఎస్పీ ఆదేశాల మేరకు పోలీస్స్టేషన్ విద్యుత్ దీపాలతో అలంకరించామని సీఐ రాంనర్సింహారెడ్డి పేర్కొన్నారు.
కోనేటిరాయ.. కోటొక్క దండాలయా
కోనేటిరాయ.. కోటొక్క దండాలయా