ఆంటియోకియా: ఉత్తర కొలంబియాలో విషాదం జరిగింది. లోయలో స్కూల్ బస్సు పడటంతో 17 మంది మృతి చెందారు. మరో 20 మంది గాయపడ్డారు. విహార యాత్ర తిరిగి వస్తుండగా.. ఈ ఘటన జరిగింది. బస్సు కరేబియన్ పట్టణం టోలు నుండి మెడెలిన్ వైపు ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగింది. బస్సులో ఆంటియోకియోకి చెందిన హై స్కూల్ విద్యార్థులు ఉన్నారు. ఈ ప్రమాద ఘటనపై గవర్నర్ ఆండ్రెస్ జూలియన్ తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.
ఈ ప్రమాదం ఉదయం 5:40 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. 45 మంది ప్రయాణికులతో బస్సు.. సుమారు 80 మీటర్ల లోయలో పడిపోయింది. ఈ పర్యటన అధికారిక స్కూల్ కార్యక్రమం కాదని.. విద్యార్థులే స్వయంగా నిర్వహించారని పాఠశాల స్పష్టం చేసింది. మృతుల్లో బస్సు డ్రైవర్ ఉన్నారు.
Un autobús con 45 estudiantes de 11° grado cayó por un barranco este domingo en Colombia, dejando al menos 16 muertos y 20 heridos.
Los jóvenes viajaban en excursión desde la región Caribe hacia Medellín cuando el vehículo se salió de la vía en la zona de El Chispero, entre los… pic.twitter.com/PGsR7ljMHS— Noticiero El Salvador 🇸🇻 (@NoticieroSLV) December 14, 2025


