ఖషోగి హత్య కేసులో 8 మందికి శిక్ష | Saudi hands jail terms to 8 in final Jamal Khashoggi verdict | Sakshi
Sakshi News home page

ఖషోగి హత్య కేసులో 8 మందికి శిక్ష

Sep 8 2020 3:53 AM | Updated on Sep 8 2020 4:27 AM

Saudi hands jail terms to 8 in final Jamal Khashoggi verdict - Sakshi

దుబాయ్‌: వాషింగ్టన్‌ పోస్ట్‌ పత్రిక వ్యాసకర్త, సౌదీ అరేబియా విమర్శకుడు జమాల్‌ ఖషోగి హత్య కేసులో రియాద్‌ క్రిమినల్‌ కోర్టు 8 మందికి శిక్షలు ఖరారు చేసింది. సౌదీ రాకుమారుడు, దేశ పాలనలో ముఖ్యభూమిక పోషిస్తున్న మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌పై తీవ్ర విమర్శలతో వాషింగ్టన్‌ పోస్ట్‌లో పలు వ్యాసాలు రాసిన ఖషోగి హత్య ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది.  ఖషోగి 2018లో టర్కీలోని సౌదీ అరేబియా రాయబార కార్యాలయంలో హత్యకు గురయ్యారు.

సౌదీ ప్రభుత్వమే ఈ హత్య చేయించిందనే ఆరోపణలు వచ్చాయి. రాకుమారుడు సల్మాన్‌ కార్యాలయంలో పనిచేసిన ఫోరెన్సిక్‌ నిపుణులు, ఇంటలిజెన్స్, భద్రతా సిబ్బంది నిందితులుగా విచారణను ఎదుర్కొన్నారు. ఖషోగి కుటుంబం క్షమాభిక్ష ప్రసాదించడంతో నిందితుల్లో ఐదుగురు ఉరిశిక్ష నుంచి తప్పించుకున్నారు. వీరికి 20 ఏళ్ల చొప్పున శిక్ష పడింది. మిగిలిన నిందితుల్లో ఒకరికి పదేళ్లు, మరో ఇద్దరికి ఏడేళ్లు శిక్ష పడింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement