బ్రిటన్‌ కింగ్‌ ఛార్లెస్‌ను కలిసిన మోదీ | Prime Minister Narendra Modi meets King Charles at Sandringham House | Sakshi
Sakshi News home page

బ్రిటన్‌ కింగ్‌ ఛార్లెస్‌ను కలిసిన మోదీ

Jul 25 2025 12:52 AM | Updated on Jul 25 2025 12:52 AM

Prime Minister Narendra Modi meets King Charles at Sandringham House

లండన్‌: బ్రిటన్‌లో పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ అక్కడ బ్రిటన్‌ రాజు ఛార్లెస్‌ను కలిశారు. గురువారం రాజు అధికారిక నివాసాల్లో ఒకటైన నోర్ఫోక్‌ ప్రాంతంలోని సాండ్రింగ్‌హామ్‌ హౌస్‌కు విచ్చేసిన  మోదీని ఛార్లెస్‌ సాదరంగా ఆహ్వానించారు. ఇద్దరూ కొద్దిసేపు పలు అంశాలపై మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా ఛార్లెస్‌కు మోదీ తెల్లని పూరెమ్మలు ఉండే సోనోమా డేవిడియా ఇన్వాలుక్రాటా అనే వింతైన మొక్కను బహూకరించారు. 

ఈ చెట్టుకు పూసే పూలను దూరం నుంచి చూస్తే గాల్లో ఎగిరే తెల్లపావురాల్లా కనిపిస్తాయి. శ్వేతవర్ణ పూరెమ్మలు ఉండటంతో దీనిని హ్యాండ్‌కర్చీఫ్‌ చెట్టు అని కూడా అంటారు. అమ్మ పేరిట ఒక చెట్టు కార్యక్రమంలో భాగంగా ఛార్లెస్‌కు మోదీ ఈ మొక్కను బహుమతిగా అందించారు. తల్లిని గుర్తుచేసుకుంటూ ప్రతి ఒక్కరూ ఒక చెట్టు నాటాలని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం తెల్సిందే. సాధారణంగా డేవిడియా మొక్క నాటిన 20 ఏళ్ల తర్వాతే పూలు పూస్తుంది. కానీ సోనోమా రకం సంకరజాతి మొక్క కేవలం రెండు, మూడేళ్లలోనే విరగబూస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement