అమెరికా ఇరాన్ శాంతి చర్చలపై ఉత్కంఠ వీడింది. గత అర్ధరాత్రి దాటాక ఇరాన్ ప్రతినిధులు ఇస్లామాబాద్కు చేరుకున్నారు. అంతకంటే ముందే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అక్కడికి చేరారు. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో ఈ చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే.
రెండు వారాల యుద్ధ విరామం ప్రకటించినప్పటికీ.. అమెరికా మిత్రదేశం ఇజ్రాయెల్ మాత్రం లెబనాన్పై భీకర దాడులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో సుమారు 300 మంది మరణించారు. అయితే.. హెజ్బొల్లా సంస్థను తుడిచిపెట్టడమే తమ లక్ష్యమంటూ ఇజ్రాయెల్ ప్రకటించుకుంది. ఈ పరిణామంపై ఇరాన్ ఆగ్రహం.. అభ్యంతరాలు వ్యక్తం చేయగా.. లెబనాన్కు కాల్పుల విరమణ వర్తించబోదని ఇజ్రాయెల్ సమర్థించుకుంది. ఈ విషయంలో అమెరికా సైతం ఇజ్రాయెల్కు మద్దతు ప్రకటించింది. అయితే..
లెబనాన్పై దాడులు ఆగాల్సిందేనని.. లేదంటే తామూ కాల్పులకు దిగుతామని.. యుధ్ధ మళ్లీ మొదలవుతుందని హెచ్చరించింది ఇరాన్. ఈ విషయంలో ఏదీ తేల్చనిది తాము చర్చలకు అంగీకరించబోమని స్పష్టం చేసింది. ఈ తరుణంలో చర్చలపై ప్రతిష్టంభన ఏర్పడింది. అయితే.. చివరకు మెట్టు దిగిన ఇరాన్ ప్రతినిధులు హాజరు కావడంతో చర్చలు ముందుకు సాగనున్నాయి.
The homeland’s soldiers @mb_ghalibaf & @araghchi in the land of our beloved brothers and sisters, Pakistan. pic.twitter.com/FiMEDikrBk
— Iran Embassy SA (@IraninSA) April 10, 2026


