వర్సిటీపై దాడి‌: 19 మంది విద్యార్థులు మృతి | 19 Deceased In Suicide Bomb Attack At Kabul University | Sakshi
Sakshi News home page

కాబూల్:యూనివర్సిటీపై ఉగ్రదాడి‌: 19 మంది మృతి

Nov 2 2020 7:21 PM | Updated on Nov 2 2020 8:04 PM

25 Deceased In Suicide Bomb Attack At Kabul University - Sakshi

ఆప్ఘనిస్తాన్‌‌: కాబూల్‌ యూనివర్సిటీపై ఉగ్రవాదులు సోమవారం దాడికి పాల్పడ్డారు. పేలుళ్లు, కాల్పుల శబ్ధాలతో కాబూల్‌ యూనివర్సిటీ ప్రాంగణం దద్దరిల్లింది. ఈ దాడిలో 19 మంది విద్యార్థులు మరణించినట్లు ప్రాథమిక సమాచారం. మరో 22మంది గాయపడినట్లు తెలుస్తోంది. యూనివ‌ర్సిటీలో నిర్వ‌హించ‌‌బోయే‌ ఇరానియ‌న్ బుక్‌ ఫెయిర్‌ను ప్రారంభించడానికి వచ్చే అధికారులే ల‌క్ష్యంగా ఈ ఉగ్రదాడి జ‌రిగిన‌ట్లు భావిస్తున్నారు. ఈ దాడిని ఆప్ఘన్‌ ప్రభుత్వం కూడా ధ్రువీకరించింది. అయితే ఈ దాడిలో ముగ్గురు ఉగ్రవాదులు పాల్గొన్నట్లు అఫ్ఘనిస్తాన్ హోం శాఖ మంత్రి తారీఖ్ ఆరియన్ వెల్లడించారు. దాడికి పాల్పడిన ముష్కరులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. మృతుల్లో ఎక్కువమంది విద్యార్థులే. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement