హైదరాబాద్‌ | - | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌

Apr 6 2024 7:20 AM | Updated on Apr 6 2024 7:20 AM

- - Sakshi

జయహో సన్‌ రైజర్స్‌

శనివారం శ్రీ 6 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2024

ఈ ఐపీఎల్‌ సీజన్‌లో భాగ్యనగర అభిమానులు రెండో మ్యాచ్‌నూ ఆస్వాదించారు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బ్యాటర్లు పరుగుల వరద పారించగా.. శుక్రవారం డిఫెండింగ్‌ చాంపియన్‌ చైన్నె సూపర్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో హైదరాబాద్‌ బౌలర్లు సత్తా చాటారు. మ్యాచ్‌ జరిగింది హైదరాబాద్‌ సొంత మైదానం ఉప్పల్‌ స్టేడియంలో అయినా.. అందరి దృష్టి మాత్రం చైన్నె సూపర్‌ కింగ్స్‌ స్టార్‌, భారత దిగ్గజం మహేంద్ర సింగ్‌ ధోనిపై నిలిచింది. మ్యాచ్‌ ప్రారంభానికి కొన్ని గంటలముందే అభిమానులు ఉప్పల్‌ స్టేడియానికి తరలి వచ్చారు. ఒక దశలో స్టేడియంలోకి వెళ్లేందుకు తోపులాట జరిగినంత పనైంది. ఇక చైన్నె ఇన్నింగ్స్‌ సమయంలో ధోని క్రీజులోకి వచ్చిన సమయంలో మైదానమంతా ధోని పేరుతో మార్మోగిపోయింది. మ్యాచ్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కుటుంబ సభ్యులతో తిలకించగా.. పలువురు మంత్రులు, సినీతారలు హాజరయ్యారు. సన్‌రైజర్స్‌ అలవోక విజయంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండాపోయింది. – ఉప్పల్‌/సాక్షి, స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్లు

1
1/2

2
2/2

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement