
కుటుంబంతో నగర ట్రాఫిక్ చీఫ్ జి.సుధీర్బాబు
సాక్షి, సిటీబ్యూరో: శాసనసభ ఎన్నికల వేళ గ్రేటర్లో రహదారులన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి. ఓటు హక్కు వినియోగించుకునేందుకు నగరవాసులు సొంతూర్లకు వెళ్లిపోయారు. దీంతో నిత్యం వాహనాలతో కిక్కిరిసే ప్రధాన రహదారులన్నీ ఖాళీగా కనిపించాయి. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, పరిశ్రమలు, ఐటీ కంపెనీలు ఉద్యోగులకు గురువారం సెలవు దినం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రధానంగా ప్రతి రోజు వాహనాలతో కిటకిటలాడే జూబ్లీబస్ స్టేషన్, సికింద్రాబాద్, బేగంపేట,అమీర్పేట్, ఆర్టీసీ క్రాస్రోడ్స్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాసబ్ట్యాంక్, ఖైరతాబాద్, రాజ్భవన్ రోడ్, లక్డీకాపూల్, హిమాయత్నగర్, సోమాజిగూడ, పంజగుట్ట, మాదాపూర్, గచ్చిబౌలి వంటి ప్రాంతాలు గురువారం నిర్మానుష్యంగా మారాయి.
రూ.87.29 కోట్ల నగదు, వస్తువుల స్వాధీనం
సాక్షి,సిటీబ్యూరో: ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా హైదరాబాద్ జిల్లాలో బుధవారం నుంచి గురువారం వరకు ఒక్కరోజే రూ. 54.03 లక్షల విలువైన నగదు, ఇతరత్రా వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న నగదు, వస్తువుల విలువ మొత్తం రూ.87.27 కోట్లకు చేరుకుంది. ఒక్కరోజు 44ఎఫ్ఐఆర్లు నమోదు కాగా, మొత్తం ఎఫ్ఐఆర్లు వెయ్యికి చేరుకున్నాయి.