
సుల్తాన్బజార్: దేశవ్యాప్తంగా 23 బ్రాంచీలతో తన ఉనికితో పాటు హోమ్ లోన్ వ్యాపారంలో 6.80 ట్రిలియన్ మార్కును స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా అధిగమించిందని తెలంగాణ శాఖ చీఫ్ జనరల్ మేనేజర్ రాజేష్కుమార్ అన్నారు. ఈ మేరకు గురువారం కోఠిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ సర్కిల్ ఆవరణలో ఎస్బీఐ ఆధ్వర్యంలో డిసెంబర్ 1, 2, 3 తేదీలలో హైటెక్స్లో జరిగే మెగా ప్రాపర్టీ షో ప్రచార రథాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో 26 సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్ల ద్వారా హైదరాబాద్ సర్కిల్లో రూ.75 వేల కోట్ల కంటే హోమ్లోన్ ఫోర్ట్ పోలియో ఉందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో రూ.9300 కోట్ల రూపాయాల మొత్తంలో రూ.20,636 గృహ రుణాలు, టాప్ ఆప్ లోన్లను బ్యాంకు మంజూరు చేసిందన్నారు.