27 కేసులు..13 మార్లు జైలు | - | Sakshi
Sakshi News home page

27 కేసులు..13 మార్లు జైలు

Sep 17 2023 6:38 AM | Updated on Sep 17 2023 7:19 AM

- - Sakshi

హిమాయత్‌నగర్‌: ఒకటి కాదు రెండు కాదు..ఏకంగా 26 కేసుల్లో నిందితుడిగా ఉండి..ఇప్పటికే 12 మార్లు జైలు శిక్షకు గురైన ఫలక్‌నుమా వాసి మహ్మద్‌ అక్రమ్‌ (23) ఎట్టకేలకు సౌత్‌జోన్‌ క్రైం టీం, సీసీఎస్‌ పోలీసులకు పట్టుబడ్డాడు. అక్రమ్‌ నుంచి రూ.3 లక్షల ఖరీదైన బైక్‌లను స్వాధీనం చేసుకున్న పోలీసులు శనివారం రిమాండ్‌కు పంపారు. మహ్మద్‌ అక్రమ్‌ చిన్నతనం నుంచే బైక్‌ దొంగతనాలకు అలవాటుపడ్డాడు. ఇతనిపై తొలిసారి కుల్సుంపురా పీఎస్‌లో బైక్‌ చోరీ కేసు నమోదైంది. ఆ తర్వాత తాజాగా లంగర్‌హౌజ్‌ పీఎస్‌లో నమోదైన కేసులతో సంఖ్య 27కు చేరింది. 13వ సారి జైలుపాలయ్యాడు.

ఇటీవల హుమాయన్‌నగర్‌, మైలార్‌దేవులపల్లి, లంగర్‌హౌజ్‌ పీఎస్‌లలో రూ.లక్ష ఖరీదు చేసే మూడు బైక్‌లను చోరీ చేశాడు. పోలీసులు పట్టుకోవడానికి వెళ్లిన ప్రతిసారీ బ్లేడుతో చేయి కోసుకోవడం, ఆత్మహత్యాయత్నాలకు పాల్పడటం చేస్తూ పోలీసులకు సవాల్‌ విసురుతుంటాడు. సీసీఎస్‌ ఏసీపీ వెంకటేశ్వర్‌రెడ్డి నేతృత్వంలో సౌత్‌జోన్‌ క్రైమ్‌ టీం ఇన్‌స్పెక్టర్‌ వి.ఆనంద్‌కిషోర్‌ చాకచక్యంగా అక్రమ్‌ను పట్టుకుని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement