అట్టుడికిన
టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై ఉద్యోగార్థుల ఆగ్రహ జ్వాలలతో నగరం మంగళవారం అట్టుడికింది. టీఎస్పీఎస్సీ భవనం ముట్టడి, ఉస్మానియా యూనివర్సిటీ, చిక్కడపల్లి, అశోక్నగర్ తదితర ప్రాంతాల్లోని రోడ్లపై రాస్తారోకోలు, బైఠాయింపులతో ఆందోళనకు దిగారు. మరోవైపు యూనివర్సిటీ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లును గవర్నర్ వెంటనే ఆమోదించాలని డిమాండ్ చేస్తూ చలో రాజ్భవన్ ముట్టడికి బీఆర్ఎస్వీ, బీఆర్ఎస్ అనుబంధ విద్యార్థి సంఘాలు యత్నించడంతో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. – సాక్షి, సిటీబ్యూరో