శాసనసభలో పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి
హన్మకొండ చౌరస్తా: ఎన్నో ఏళ్ల పోరాటాల ఫలితంగా సాధించిన కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో ప్రాంతీయ యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. గురువారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి మాట్లాడుతూ.. విభజన చట్టంలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటులో సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ కీలక పాత్ర పోషించారని ప్ర స్తావించారు. పోలీస్ శాఖలో మల్టీజోన్ పదోన్నతులు, ఏఆర్ నుంచి సివిల్ విభాగానికి కన్వర్షన్ వంటి అంశాలు చాలా ఏ ళ్లుగా పెండింగ్లో ఉండడాన్ని ఆయన.. సభ దృష్టికి తీసుకొ చ్చారు. 40శాతం రిజర్వేషన్ అమలు కాకపోవడం వల్ల పోలీ స్ సిబ్బందికి తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధి దాదాపు 20 ఏళ్లు వెనుకబడిందన్నారు.
సత్ప్రవర్తన కలిగిన ఖైదీల
విడుదలకు రంగం సిద్ధం
మొత్తం 102 మంది జీవిత ఖైదీల జాబితా
ఇతర జిల్లా జైళ్లలో ఉన్న
వరంగల్ ఖైదీలకు అవకాశం
సీఎం పరిశీలనలో ఖైదీల విడుదల ఫైల్
ఈ ఏడాది జాబితాపై ఆశలు


