
అంచెలంచెలుగా ఎదిగి.. నేలకొరిగి
హసన్పర్తి: విద్యార్థి దశ నుంచే విప్లవ భావాలు. పీజీ పూర్తిచేశాక నేరుగా మావో యిస్టు పార్టీకి ఆకర్షితుడై అందులో చేరారు. తొమ్మిదేళ్ల పాటు పార్టీలో పనిచేసి అంచెలంచెలుగా ఎదిగిన బూర రాకేశ్ చివరికి ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో నేలకొరిగాడు. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్ట్ అగ్రనేత సంబాల కేశవరావు అలియాస్ బసవరాజుతోపాటు 26 మంది కాల్పుల్లో మృతి చెందారు. ఇందులో హసన్పర్తి మండలం చింతగట్టుకు చెందిన బూర రాకేశ్ అలియాస్ వివేక్ ఉన్నట్లు ఛత్తీస్గడ్ పోలీసులు ప్రకటించారు. హసన్పర్తి మండలం చింతగట్టుకు చెందిన రాకేశ్ది నిరుపేద కుటుంబం. తల్లిదండ్రులు సరోజన–బాబు. తండ్రి ట్రాక్టర్ డ్రైవర్. తల్లి కూలీ. సోదరుడు రంజిత్కుమార్ ఆటోడ్రైవర్. రాకేశ్ బాల్యం చింతగట్టులోనే గడిచింది. 2009లో చింతగట్టు పాఠశాలలో పదో తరగతి పూర్తి చేశాడు. ఈతర్వాత నగరంలోని స్నేహా కళాశాలలో (2009–11) ఇంటర్ పూర్తి చేశాడు. 2011–14 వరకు నగరంలోని ఓప్రైవేట్ కళాశాలలో డిగ్రీ చదివాడు. ఆతర్వాత నగరంలోని ఓ కళాశాలలో పీజీ పూర్తి చేశాడు.
2016లో అడవిలోకి..
మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితుడై 2016లో అజ్ఞాతంలోకి వెళ్లాడు. మరుసటి ఏడాది అప్పటి కార్పొరేటర్లు కాయిత సమ్మిరెడ్డి, దాస్యం విజయ్భాస్కర్, ప్రస్తుత హసన్పర్తి పీఏసీఎస్ చైర్మన్ ఉదయ్కుమార్రెడ్డి, హసన్పర్తి మండల పరి షత్ మాజీ ఉపాధ్యక్షుడు బండా రత్నాకర్రెడ్డి, పెగడపల్లి మాజీ సర్పంచ్ నరేడ్ల శ్రీధర్ను హతమార్చేందుకు రెక్కీ నిర్వహించాడు. ఇంట్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల ఉదయ్కుమార్రెడ్డి తప్పించుకున్నారు. అజ్ఞాతంలో ఉన్నప్పటికీ ఓసారి చింతగట్టుకు వచ్చినట్లు ప్రచారం జరిగింది. తొమ్మిదేళ్ల క్రితమే అజ్ఞాతంలోకి వెళ్లిన రాకేశ్ అంచెలంచెలుగా ఎదుగుతూ అగ్రనేతకు కంప్యూటర్ ఆపరేటర్గా వ్యవహరించాడు.
విద్యార్థి దశ నుంచే.. విప్లవ భావాలు
2016లోనే అడవిబాట
2017లో ఐదుగురిపై రెక్కీ
ముగిసిన రాకేశ్ ప్రస్థానం