
టీపీటీఎఫ్ ఆవిర్భావ దినోత్సవం
విద్యారణ్యపురి: తెలంగాణ ప్రొగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) ఆవిర్భావ దినోత్సవం గురువారం హనుమకొండలోని ఆ ఉపాధ్యాయ సంఘం కార్యాలయంలో నిర్వహించారు. టీపీటీఎఫ్ రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు నటరాజ్ సంఘం జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో కార్యకర్తల అభిప్రాయాలకు మేరకు సంఘం పనిచేయాలన్నారు. ఉపాధ్యాయుల సమస్యలతోపాటు సామాజిక సమస్యలపై టీపీటీఎఫ్ అనేక పోరాటాలుచేసిందన్నారు. కార్యక్రమంలో టీపీటీఎఫ్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు బత్తిని రామాంజనేయులు, జనరల్ జనరల్ సెక్రటరీ గొడిశాల సత్యనారాయణ, బాధ్యులు ఎం. రఘుపతి, సీహెచ్ లక్ష్మయ్య, కుమారస్వామి ఉపాధ్యాయులు పాల్గొన్నారు.