ఫిర్యాదులు.. ఇష్టానుసారంగా | - | Sakshi
Sakshi News home page

ఫిర్యాదులు.. ఇష్టానుసారంగా

May 30 2025 12:50 AM | Updated on May 30 2025 12:50 AM

ఫిర్యాదులు.. ఇష్టానుసారంగా

ఫిర్యాదులు.. ఇష్టానుసారంగా

హన్మకొండ : టీజీఎన్పీడీసీఎల్‌లో ఫిర్యాదుదారుడి పేరు, చిరునామా లేని ఆకాశరామన్న ఉత్తరాలు (ఫిర్యాదులు) ఉద్యోగులు, అధికారులను బెంబేలెత్తిస్తున్నాయి. వివిధ ఫిర్యాదులపై అధికారుల తక్షణ స్పందనతో ఫిర్యాదుదారులు పెట్రేగిపోతున్నారు. ఇష్టానుసారంగా ఫిర్యాదులు చేస్తూ క్షణికానందం పొందుతున్నారు. దీంతో ఉద్యోగులు, అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే అనామక (ఆకాశరామన్న), చిరునామా లేని ఫిర్యాదులను పరిశీలన, విచారణకు స్వీకరించాల్సిన అవసరం లేదని సెంట్రల్‌ విజిలెన్స్‌, స్టేట్‌ విజిలెన్స్‌ ఆదేశాలు స్పష్టంగా ఉన్నా.. కొందరు అధికారులు అత్యుత్సాహం చూపుతూ విచారణ చేపడుతున్నారు. ఇదే అదునుగా ఆకాశరామన్న ఉత్తరాలు రాసే వారు పెట్రేగిపోతున్నారని విద్యుత్‌ ఉద్యోగులు మండిపడుతున్నారు.

వ్యక్తిగత కక్షలు నేరుగా ఎదుర్కోలేక..

వ్యక్తిగత కక్షలు నేరుగా ఎదుర్కోలేక ఆకాశరామన్న ఉత్తరాలు, ఫిర్యాదులతో తమ కోపాన్ని తీర్చుకుంటున్నారనే ప్రచారం విద్యుత్‌ ఉద్యోగ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. టీజీ ఎన్పీడీసీఎల్‌ పరిధిలోని 16 సర్కిళ్లలో ఈ వింత పోకడలు ఉద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటున్నాయి.

ప్రత్యర్థుల క్షణికానందం..

ప్రధానంగా యాజమాన్యం ప్రతీ అనామక ఫిర్యాదుపై స్పందించి విచారణ చేస్తుండడంతో పేరు, చిరునామా లేని ఫిర్యాదులు చేస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. అంతే కాకుండా ఫిర్యాదుకు గురైన ఉద్యోగి, అధికారి పడుతున్న ఇబ్బందులను చూసి ప్రత్యర్థులు క్షణికానందం పొందుతున్నారు. విద్యుత్‌ ఉద్యోగులు గ్రూపులుగా విడిపోయి ఒకరిపై మరొకరు ఆకాశరామన్న ఉత్తరాల పేరుతో ఫిర్యాదులు చేసుకోవడం పరిపాటిగా మారిందని విద్యుత్‌ ఉద్యోగులు వాపోయారు. ఇంత జరుగుతున్న ఉద్యోగ, కార్మిక సంఘాలు చోద్యం చూస్తున్నాయే కాని, వీటిని అరికట్టేందుకు సంఘాల నాయకులు పూనుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సెంట్రల్‌ విజిలెన్స్‌ ఆదేశాలు బేఖాతర్‌..

పేరు, చిరునామా లేకుండా వచ్చిన అనామక ఫిర్యాదులను పట్టించుకోవద్దని సెంట్రల్‌ విజి లెన్స్‌ స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో పా టు కోర్టులు ఇచ్చిన తీర్పులను సైతం ఉదాహరించింది. చిత్తశుద్ధి, బాధ్యత, పారదర్శకంగా పని చేసే అధికారులపై కొందరు ఇలాంటి ఫిర్యాదులు చేసే అవకాశముందని, ఇలాంటి ఫిర్యాదులు విచారణకు స్వీకరించాల్సిన అవసరం లేదని తెలిపింది. అయినా అత్యుత్సాహం చూపుతున్న కొందరు అధికారులు దురుద్దేశంతో విచారణ చేపడుతున్నారని, తమను మానసిక వేదనకు గురి చేస్తున్నారని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. వీటిని అరికట్టాల్సిన యాజమాన్యం విచారణలకు ఆదేశిస్తుండడంతో ఫిర్యాదుదారులు పెట్రేగిపోతున్నారని ఉద్యోగులు తెలిపారు. ఇప్పటికై నా యాజమాన్యం అనా మక, ఆకాశరామన్న ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు లేకుండా, సెంట్రల్‌, స్టేట్‌ విజిలెన్స్‌ ఆదేశాలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని విద్యుత్‌ ఉద్యోగులు కోరారు.

తప్పులు జరిగితే అప్పుడే ఎందుకు స్పందించరు?

అధికారులు, ఉద్యోగులు విధులు నిర్వర్తించే సమయంలో కాకుండా రిటైర్మెంట్‌ ముందు ఆకాశరామన్న లేఖల ద్వారా ఫిర్యాదులు పంపుతుండడం సరికాదని పలు సంఘాలు, అసోసియేషన్ల నాయకులు, ఉద్యోగులు పేర్కొంటున్నారు. తప్పులు జరిగితే అప్పుడే ఎందుకు స్పందించలేదని ప్రశ్నిస్తున్నారు. ఒకరిపై మరొకరు ఉద్యోగ విరమణ సమయంలో ఫిర్యాదులు చేస్తే పరిస్థితులు ఎటువైపు వెళ్తాయో ఆలోచించాలని అకాశరామన్న ఉత్తరాలు రాసే వారికి సూచిస్తున్నారు. ఈ పరిణామాలు ఇలాగే కొనసాగితే ఏ ఉద్యోగి కూడా సంతోషంగా విరమణయ్యే అవకాశం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది మంచి సంప్రదాయం కాదని విద్యుత్‌ ఉద్యోగులు హెచ్చరిస్తున్నారు.

విద్యుత్‌ ఉద్యోగులను

బెంబేలెత్తిస్తున్న పేరులేని ఫిర్యాదులు

ఫిర్యాదులపై అధికారుల స్పందనతో

పెట్రేగిపోతున్న ఫిర్యాదుదారులు

అనామక ఫిర్యాదులపై విచారణ

చేపట్టొద్దని విజిలెన్స్‌ ఆదేశాలు..

అయినా పట్టించుకోని కొందరు అధికారులు.. విచారణకు ఆదేశం

ఇదే అదునుగా భావిస్తున్న ప్రత్యర్థులు

విద్యుత్‌ ఉద్యోగుల నుంచి

వెల్లువెత్తుతున్న నిరసన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement