ప్రభుత్వాల మెడలు వంచుదాం | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వాల మెడలు వంచుదాం

Jun 1 2025 1:04 AM | Updated on Jun 1 2025 1:04 AM

ప్రభుత్వాల మెడలు వంచుదాం

ప్రభుత్వాల మెడలు వంచుదాం

హన్మకొండ: ఉద్యమాల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి, కార్మికుల హక్కులు సాధించుకుందామని బీఆర్‌ఎస్‌ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్‌ అన్నారు. కార్మిక మాసోత్సవం ముగింపు సందర్భంగా హనుమకొండ బాలసముద్రంలోని ఏకశిల పార్కు వద్ద శనివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల హక్కుల సాధన కోసం బలమైన ఉద్యమాలు నిర్మించాల్సిన సమ యం ఆసన్నమైందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్‌ కోడ్‌లను తక్షణమే ఉపసంహరించుకోవాలని సూచించారు. కేసీఆర్‌ పాలనలో వీధి వ్యాపారులకు రుణాలు అందించడంతో పాటు వెండింగ్‌ జోన్లను ఏర్పాటు చేసినట్లు గుర్తుచేశారు. నాడు తెచ్చిన 2014 చిరు వ్యాపారుల రక్షణ చట్టాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు బొంగు అశోక్‌ యాదవ్‌, చెన్నం మధు, సంకు నర్సింగ్‌, సోదా కిరణ్‌, కార్యక్రమ కన్వీనర్‌ నాయిని రవి, కార్మిక నాయకులు, తెలంగాణ ఆటో యూనియన్‌, ప్రతాపరుద్ర ఆటో యూనియన్‌, భవన నిర్మాణ రంగంలోని 14 రంగాల కార్మికులు, చిరు వ్యాపారులు, తదితరులు పాల్గొన్నారు.

బీఆర్‌ఎస్‌ హనుమకొండ జిల్లా

అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement