పోలీస్‌ అధికారులకు సేవా పతకాలు | - | Sakshi
Sakshi News home page

పోలీస్‌ అధికారులకు సేవా పతకాలు

Jun 2 2025 1:29 AM | Updated on Jun 2 2025 1:29 AM

పోలీస్‌ అధికారులకు  సేవా పతకాలు

పోలీస్‌ అధికారులకు సేవా పతకాలు

వరంగల్‌ క్రైం: వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో పనిచేస్తున్న 12 మంది పోలీస్‌ అధికారులకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సేవా పతకాలను ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో ఒకరు ఉత్తమ సేవా పతకాని కి, 11 మంది పోలీస్‌ అధికారులు సేవా పతకా లకు ఎంపికయ్యారు. వీరిని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌సింగ్‌ ఆదివారం అభినందించారు. ఉత్తమ సేవా పతకానికి హనుమకొండ పోలీస్‌స్టేషన్‌ ఏఎస్సై ఎ.రఘునారెడ్డి, సేవా పతకానికి ట్రాఫిక్‌ ఏసీపీ సత్యనారాయణ, సీసీఆర్‌బీ ఎస్సై జె.విల్సన్‌, సుబేదారి ఎస్సై పి.ప్రకాశ్‌రెడ్డి, ఏఆర్‌ఎస్సై ఎండీ.మక్బుల్‌పాషా, ఏఆర్‌ఎస్సై ఎం.రాంధన్‌, కాజీపేట ఏఎస్సై వి.చంద్రమౌళి, ఏఆర్‌ ఎస్సై షేక్‌ పాషా, ఏఆర్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ ఎండీ.ఖాజానజీముద్దీన్‌, ఏఆర్‌ హెడ్‌కానిస్టేబుల్‌ బస్సు భీమయ్య, మామునూర్‌ పోలీస్‌స్టేషన్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ బి.రమేష్‌, వంగర పోలీస్‌ స్టేషన్‌ కానిస్టేబుల్‌ కె.తిరుపతిగౌడ్‌ ఎంపికయ్యారు.

డొనేషన్ల వసూలుపై

చర్య తీసుకోవాలి

కేయూ క్యాంపస్‌: హనుమకొండలోని ఓ ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో ముందస్తు అడ్మిషన్లు కల్పిస్తూ డొనేషన్లు వసూలు చేస్తున్నారని, సదరు కాలేజీపై వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) రాష్ట్ర అధ్యక్షుడు మొగిలి వెంకటరెడ్డి కోరారు. ఈమేరకు ఆదివా రం కాకతీయ యూనివర్సిటీలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్‌ చైర్మన్‌ ఇ.పురుషోత్తంను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ.. నిబంధనలకు విరుద్ధంగా ముందస్తు అడ్మిషన్లు ఇవ్వడం సరికాదని సంబంధిత కళాశాలపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి రంజిత్‌ కుమార్‌, బాధ్యులు శంకర్‌ పాల్గొన్నారు.

‘ప్రాథమిక విద్యను

నిర్వీర్యం చేయొద్దు’

విద్యారణ్యపురి: ప్రాథమిక విద్యను నిర్వీర్యం చేయొద్దు.. ఇటీవల పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన టీచర్ల సర్దుబాటు ఉత్తర్వులు ప్రాథమిక విద్యను నిర్వీర్యం చేసేలా ఉన్నాయి.. వాటిని వెనక్కి తీసుకోవాలని పీఆర్‌టీయూ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు మంద తిరుపతిరెడ్డి, జనరల్‌ సెక్రటరీ ఫలిత శ్రీహరి డిమాండ్‌ చేశా రు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే విధంగా సర్దుబాటు ఉత్తర్వులు ఉండాలని, అనవసరమైన రేషనలైజేషన్‌ నిబంధనలను పాటించడం వల్ల ప్రాథమిక విద్యపై ప్రతికూల ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. ‘బడిబాట’ కార్యక్రమం పూర్తయ్యాకే టీచర్ల సర్దుబాటు చేపట్టాలని ఒక ప్రకటనలో కోరారు.

‘బెస్ట్‌ అవైలబుల్‌ స్కీం’

దరఖాస్తుల ఆహ్వానం

న్యూశాయంపేట : బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్‌ స్కీం పథకం ద్వారా షెడ్యూల్‌ కులాలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులకు 2025–26 విద్యాసంవత్సరం అడ్మిషన్ల కోసం అర్హులు దరఖాస్తు చేసుకోవాలని వరంగల్‌ జిల్లా షెడ్యూల్‌ కులాల అభివృద్ధి అధికారి పి.భాగ్యలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. వరంగల్‌ జిల్లాకు 1వ తరగతి 60 సీట్లు, 5వ తరగతి 62 సీట్లు కేటాయించారని, ఈనెల 16వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని, ఇతర వివరాలకు సహాయ సాంఘిక సంక్షేమ అధికారి కార్యాలయం, వరంగల్‌, సహాయ సాంఘిక కార్యాలయం సంక్షేమాధికారి, నర్సంపేటలో సంప్రదించాలని సూచించారు.

రామ్‌కిషన్‌కు సన్మానం

హన్మకొండ: ప్రపంచ ఆరోగ్య సంస్థ సలహా ప్యానెల్‌ సభ్యుడిగా నియమితుడైన హనుమకొండకు చెందిన డాక్టర్‌ అజ్మీరా రామ్‌కిషన్‌ను వరంగల్‌ ఎంపీ డాక్టర్‌ కడియం కావ్య ఆదివారం సన్మానించారు. హనుమకొండ కనకదుర్గ కాలనీలోని స్వగృహంలో ఎంపీ డాక్టర్‌ కావ్యను అజ్మీరా రామ్‌కిషన్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ కావ్య ఆయనను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. పరకాల నియోజకవర్గంలోని బావుసింగ్‌పల్లికి చెందిన రామ్‌కిషన్‌ ప్రస్తుతం ఢిల్లీలో జాయింట్‌ డ్రగ్‌ కంట్రోలర్‌గా పనిచేస్తున్నారు. వైద్యరంగంలో అపారమైన సేవలందిస్తూ ప్రపంచంలోని ప్రముఖ సంస్థకు సలహాదారుడిగా వ్యవహరించడం గొప్ప విషయమని ఎంపీ కావ్య కొనియాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement