
పురోగతిలో ఆర్టీసీ వరంగల్ రీజియన్
● రీజినల్ మేనేజర్ దర్శనం విజయభాను
హన్మకొండ: గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం అన్ని పారామీటర్లలో పురోగతిని సాధించామని ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ దర్శనం విజయభాను అన్నారు. సోమవారం హనుమకొండలోని వరంగల్ రీజియన్ కార్యాలయంలో తెలంగాణ అవతరణ దినోత్సవం జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 2024 నుంచి మార్చి 2025 వరకు గత సంవత్సరంతో పోలిస్తే అదనంగా 29.51 లక్షల కిలోమీటర్లు బస్సులు నడిపి, రూ.134.66 కోట్ల అదనపు ఆదాయం పొందామన్నారు. మహాలక్ష్మి పథకం ప్రారంభమైనప్పటి నుంచి వరంగల్ రీజియన్లో సుమారు రూ.617.18 కోట్ల ఆదాయం పొందామన్నారు. అదే విధంగా గత నెలలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రకటించిన గ్రాండ్ పీక్ చాంలెంజ్లో కూడా వరంగల్ రీజియన్ టార్గెట్ మీద 109 శాతం అధిక ఆదాయం సాధించి రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచామన్నారు. అదే విధంగా మే 15 నుంచి 26 వరకు జరిగిన సరస్వతీనది పుష్కరాల సందర్భంగా వరంగల్ రీజియన్ మొత్తం 1,503 బస్సులు నడిపి దాదాపు 4.86 లక్షల ప్రయాణికులను సురక్షితంగా చేరవేసి అధికారుల నుంచి ప్రశంసలు అందుకున్నామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ ఆర్ఎం కేశరాజు భాను కిరణ్, అకౌంట్స్ ఆఫీసర్ ఎ.రవీందర్, తదితరులు పాల్గొన్నారు.
తనయుడి మృతి..
మరునాడే తండ్రి మరణం
ఎల్కతుర్తి: అనారోగ్యం బారిన పడిన కొడుకు ఎంజీఎంలో చికిత్స పొదుతూ ఆదివారం మృతి చెందాడు. కొడుకు మరణవార్త తెలిసిన తండ్రి మరునాడు సోమవారం మరణించిన ఘటన హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం సూరారంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. ములుగూరి శ్రీని వాస్కు 15 ఏళ్ల క్రితం పెరాలసిస్ వచ్చింది. ఇటీవల వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి తండ్రి పోచయ్యకు ఇటీవల గుండెపోటు రావడంతో హైదరాబాద్లోని ఓ ఆస్పత్రికి తరలించారు. మూడు వాల్స్ బ్లాక్ అయ్యాయి.. స్టంట్ వేయలేం.. ఓపెన్ హార్ట్ సర్జరీ చేయలేం.. తీసుకువెళ్లమని వైద్యులు సూచించడంతో కు టుంబసభ్యులు పోచయ్యను ఇంటికి తీసుకొచ్చారు. అతడి ఆరోగ్యం క్షీణించి మంచం పట్టిన విషయం తెలిసిన కుమారుడు శ్రీనివాస్కు ఆస్పత్రిలోనే ఫిడ్స్ వచ్చి ఆదివారం మృతి చెందాడు. కొడుకు మరణవార్త విన్న తండ్రి పోచయ్య(75) కలత చెంది సోమవారం సాయంత్రం మరణించాడు.

పురోగతిలో ఆర్టీసీ వరంగల్ రీజియన్