
టీజీ ఎన్పీడీసీఎల్లో కొత్త ఒరవడికి శ్రీకారం
హన్మకొండ: టీజీ ఎన్పీడీసీఎల్ కొత్త ఒరవడికి శ్రీకా రం చుట్టిందని ఆ కంపెనీ ఇన్చార్డ్ డైరెక్టర్ (హెచ్ఆర్డీ) బి.అశోక్ కుమార్ అన్నారు. సోమవారం హనుమకొండ నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ముందు జాతీయ పతాకాన్ని ఇన్చార్డ్ డైరెక్టర్ బి.అశోక్ కుమార్ ఆవిష్కరించారు. అనంతరం విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన విద్యుత్ ఉద్యోగులకు అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా అశోక్ కుమార్ మాట్లాడుతూ సీఎండీ వరుణ్ రెడ్డి టీజీ ఎన్పీడీసీఎల్లో సాంకేతిక సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. విద్యుత్ ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ రూ. కోటీ ప్రమాద బీమా సౌకర్యం కల్పించారన్నారు. విద్యుత్ ఉద్యోగులకు శిక్షణ నిర్వహణ, ఇ–స్టోర్స్, డిస్ట్రిబ్యూషన్ ఆటోమేషన్ – కంట్రోల్, కస్టమర్ కేర్ సెంటర్, విద్యుత్ ప్రజావాణి, సైది సైఫీ లాంటి ఎన్నో నూతన విధానాలకు సీఎండీ రూపకల్పన చేశారని వివరించారు. ప్రస్తుతం రూ.2780 కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్నారు. మినిస్ట్రీ ఆఫ్ పవర్ 2023 సంవత్సరానికి కన్జ్యూమర్ సర్వీస్ రేటింగ్ లో ‘ఎ’ గ్రేడ్ సాధించామన్నారు. ఎన్పీడీసీఎల్కి ఇప్పా యి పవర్ అవార్డులు 4 దక్కాయని తెలిపారు. కార్యక్రమంలో ఇన్చార్జి డైరెక్టర్లు టి.సదర్లాల్, వి.తిరుపతి రెడ్డి, టి.మధుసూదన్, చీఫ్ ఇంజనీర్లు కె.తిరుమల్ రావు, రాజుచౌహాన్, రవీంద్రనాథ్, కె.వెంకట రమణ, జాయింట్ సెక్రటరీ కె.రమేశ్, కంపెనీ కార్యదర్శి కె.వెంకటేశం, వరంగల్ ఏపీటీఎస్ సీఐ కిరణ్, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
ఇన్చార్జ్ డైరెక్టర్ బి.అశోక్కుమార్